Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరలను తగ్గించకుంటే ప్రభుత్వాలను దిగ్బంధిస్తాం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 31,2022

ధరలను తగ్గించకుంటే ప్రభుత్వాలను దిగ్బంధిస్తాం..

- పెంపుదలకు అడ్డూ అదుపు లేదా ?
- తగ్గించేవరకు ప్రజాపోరాటాలు కొనసాగుతాయి
- వామపక్ష పార్టీల నేతల హెచ్చరిక
- కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
               పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలను తక్షణం తగ్గించాలి.. మోడీ పాలనలో ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.. ధరాభారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుల, మత విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారు..'' అని వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్ల ఎదుట వామపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడారు. మోడీకి స్వదేశీ సేవలు తక్కువై విదేశాలపై ప్రేమ ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర ధరలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో కొద్దిపాటి వేతనాలతో బతికే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. ఈ ధరల పెరుగుదల అసంఘటితరంగ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ పెరుగుదల శ్రమ జీవులందరి సమస్యని, అందులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు పూనుకున్నాయని చెప్పారు. బంగారు బాతులాంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే బీజేపీ చేసే అభివృద్ధా అని ప్రశ్నించారు. వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గించుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దిగ్బంధిస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌తో కలిసి ధర్నాలో చెరుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌, వంటగ్యాస్‌ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే, అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
               కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యంగా కలిసి ఉంటున్న హిందూ, ముస్లింల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి రాజీవ్‌ గాంధీ చౌరస్తాలో ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఖమ్మం ధర్నాచౌక్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్‌, న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) జిల్లా నాయకులు ఎం.గిరి మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పెట్టుబడిదారులకే ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను వేగవంతం చేసిందని, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను కారుచౌకగా దోచి పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాల దుష్ప్రభావాలు ప్రజలమీద విపరీతంగా పడ్డాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హిందూత్వ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌ రాజేశంకు వినతిపత్రం అందజేశారు. నిర్మల్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట కూడా ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా అనంతరం కలెక్టర్‌ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.