Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి సమయంలో వారందించిన సేవలకు తిరుగులేదు. మనిషిని చూస్తే భయపడిన కాలంలోనూ కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించిన కాటికాపరులు వారు. అలాంటి వారి సేవలకు ఇప్పటి వరకూ తగిన గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్స్ రిటైరీస్ అసోసియేషన్ ద్వైవార్షిక సమావేశం సందర్భంగా సోమవారం హైదరాబాద్లో నలుగురు కాటికాపరులను సన్మానించారు. కుటుంబ సభ్యులే ముందుకు రాని సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించిన గొప్పవారు కాటికాపరులని వక్తలు కొనియాడారు. శాలువతో సత్కరించి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్.ఎం.దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.