Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగోడు
మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని తాటిపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద గొల్ల నగేష్ (29) తమ నాలుగెకరాల భూమితోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. అయితే, పంటల దిగుబడి సరిగా రాక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక నగేష్ మనస్తాపానికి గురయ్యాడు. దాంతో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. పక్క చేను రైతులు గమనించి వెంటనే నారాయణఖేడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి నగేష్ మృతి చెందాడు.