Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెద్దలకు రాయితీలు ప్రజలపై భారాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 01,2022

పెద్దలకు రాయితీలు ప్రజలపై భారాలు

- పెట్రోల్‌, డీజిల్‌ ధరలపెంపుతో బడుగుల బతుకులు ఆగం
- కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్‌..
- దేశాన్ని కొల్లగొడుతున్న బీజేపీ : వామపక్షాల ధర్నాలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో లజ్జారహితంగా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, దేశ ప్రజలపై భారాలు మోపిందని వక్తలు విమర్శించారు. డీజిల్‌, పెట్రోల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని మహాధర్నాచౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు.
కార్పొరేట్లకు ఊడిగం...
             కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేసే ప్రధాని దేశానికి దొరకడం మన దౌర్భాగ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. దేశాన్నేలిన ఎనిమిదిమంది ప్రధానులు చేసిన అప్పుకంటే..ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పులు ఎక్కువనీ, ఆ రకంగా అందరికంటే ఆయన ముందున్నాడని ఎద్దేవా చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక 23 పబ్లిక్‌ రంగ సంస్థలను అమ్మేశారని తెలిపారు. దేశ ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును లూటీ చేసిన 29మంది మోసగాండ్లకు మోడీ సర్కార్‌ బాసటగా నిలుస్తున్నదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి దగుల్బాజీ ప్రధాని ఉన్నాడని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి సంస్థలను ప్రయివేట్‌ వారికి కట్టబెట్టే హక్కు వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
బాదుడే...తగ్గేదేలే..
             సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రెండేండ్లుగా కూరగాయల ధరలు పెరుగుడే కానీ..తగ్గుడు లేదని తెలిపారు. వంటనూనెల నుంచి మొదలు అన్నింటి ధరలు మధ్యతరగతి, సామాన్య ప్రజలు అందుకోని రీతిలో నిత్యావసర ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌,బొగ్గు ధరలు పెరిగాయి కాబట్టి నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పటం వరకు పరిమితమవుతున్నారని చెప్పారు. చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించాల్సిన అవసరముందన్నారు. దీనికి మోడీ వందిమాగదులు చేప్పే సమాధానం సత్యదూరంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర పెరిగింది. కాబట్టి వీటి ధరలు పెరుగుతున్నాయని ఇప్పటిదాక చెప్పుకుంటూ వచ్చారన్నారు. ఇప్పుడు మరో రకమైన వాదన తెస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌ యుద్దం వల్ల ధరలు పెరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మెడకాయమీద తలకాయ ఉన్నోడు ఎవరు కూడా నమ్మని విధంగా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గినా..భారత దేశంలో డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏం చెప్పినా చెల్లుబాటవుతుందని మోడీ ప్రభుత్వం భావించటం వల్లనే పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని వివరించారు. భారాలు ప్రజలపై మోపి..లాభాలు మాత్రం కార్పొరేట్లకు కట్టబెట్టడం న్యాయమా?అని అడిగారు. అందుకే దీన్ని దగుల్బాజీ ప్రభుత్వంగా పరిగణించాలని తెలిపారు. లజ్జారహితంగా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, బడాబాబుల సేవలో కేంద్ర సర్కార్‌ తరిస్తున్నదని విమర్శించారు. దేశాన్ని బీజేపీ కోసం దోచి పెడుతున్నదని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతిని మోడీ ప్రభుత్వం చట్టబద్దం చేసిందని విమర్శించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం అంతం కాదు..ఆరంభం మాత్రమేనని చెప్పారు.
బారానా పెంచి..చారానా తగ్గించి...
             మోడీ సర్కార్‌ ప్రజలకు ఎంతో సేవచేసానంటూ ఎచ్చులకు పోతున్నదనిసీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రంగయ్య అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బారానా పెంచి చారానా తగ్గించి దేశానికి ఏదో మేలు చేశామని చెప్పటం కపటత్వమని చెప్పారు.సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో పెట్టుబడి దారుల ప్రయోజనాలకోసమే మోడీ సర్కారు పనిచేస్తున్నదని చెపారు. పేదలు మరింత పేదలవుతుంటే..సంపన్నులు మరింత సంపదపోగేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జి ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై ధరల భారాలు పెరుగుతున్నాయని చెప్పారు.
మరో పక్క వేతనాలు పడిపోతున్నాయని తెలిపారు. ఎస్‌యుసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వ విధానాలు అర్థం కాకుండా ఉండేందుకే దేశంలో కుల, మత దురభిమానాలను పెంచుతున్నారని విమర్శించారు.ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పీ నాయకులు ప్రసాద్‌, రాజేశ్‌, జానకి రాములు మాట్లాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేశ్‌, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె.రమ, సీపీఐ(ఎంఎల్‌) ఎన్‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్దన్‌, ఎన్డీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న ఇతర వామపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.