Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎనిమిదేండ్లలో ఐటీలో అద్భుత పురోగతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 02,2022

ఎనిమిదేండ్లలో ఐటీలో అద్భుత పురోగతి

- గతేడాది 26.14 శాతం వృద్ధి
- 4.1 లక్షల మందికి ఉద్యోగాలు
- రూ.1,83,569 కోట్ల విలువైన ఎగుమతులు
- 2021-22 ప్రగతి నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
గత ఎనిమిదేండ్లలో తెలంగాణ ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది జాతీయ సగటు 17.2 శాతం కంటే తొమ్మిది శాతం అధికంగా 26.14 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. ఆయా ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లని వివరించారు.
దేశంలో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉందనీ, ఎనిమిదేండ్లలో 4.1 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఈ నెల 20న టీహబ్‌ రెండో దశను ప్రారంభిస్తామనీ, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీని ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రావిర్భావం నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లనీ, ప్రస్తుతం రూ.1,83,569 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఉద్యోగుల సంఖ్య నాడు 3,23,396 కాగా అది 7,78,121 అయిందని చెప్పారు.
ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలు ముదుకొచ్చాయని తెలిపారు. గోల్డ్‌ మ్యాన్‌ సాచ్స్‌, వన్‌ ప్లస్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే, మాస్‌ మ్యూచువల్‌, స్టెల్లియంట్స్‌, జెన్‌ పాక్ట్‌, కందికోయలో ఐటీ పార్కు ఏర్పాటు, అమెరికాకు చెందిన క్వాలికామ్‌, జర్మనీకి చెందిన బహుళ జాతి సంస్థ బోస్చ్‌, గూగుల్‌ ప్రధాన కేంద్రం తర్వాత అతి పెద్ద క్య్షాంపస్‌ ఏర్పాటు, హ్యూండారుతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం, జెడ్‌ఎఫ్‌ అతి పెద్ద ఇంజినీరింగ్‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటు, ఎలక్ట్రికల్‌ వెహికల్‌ తయారీదారు ఫిస్కర్‌, కాల్‌ వే గోల్ఫ్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ కంపెనీలని గుర్తుచేశారు. అదే విధంగా ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్‌లో ఐటీ టవర్‌ సేవలను అందిస్తుండగా, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, సిద్ధిపేటలో పనులు పూర్తయి ఈ ఏడాది అక్టోబర్‌ లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నల్లగొండలో ఐటీ హబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు.
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం (ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌)ను ఎప్పటికప్పుడు రాష్ట్రానికి పరిచయం చేస్తున్నామన్నారు. స్కైవే ద్వారా అత్యవసర రోగులకు మందుల సరఫరా, అగ్రిటెక్‌ ప్రాజెక్ట్‌, క ృత్రిమ మేధస్సు తదితర వాటిని వినియోగించుకుంటున్న తీరును వివరించారు.
ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 4,500 మీ సేవా కేంద్రాల ద్వారా 600కు పైగా సేవలను అందిస్తున్నామన్నారు. అవి 2.6 కోట్ల మంది పౌరులకు ఏడాదికి రూ.4,500 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించాయని తెలిపారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ) ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. టీ హబ్‌ ద్వారా రెండు వేల అంకుర సంస్థలు వచ్చాయని గుర్తుచేశారు. వురు హబ్‌తో మహిళలను, బాలికలను ప్రోత్సహిస్తున్నామన్నారు. టి వర్క్స్‌ ద్వారా సమస్యలకు నూతన పరిష్కారాలను చూపిస్తున్నామని వివరించారు. తెలంగాణ అకాడమీ ఆప్‌ స్కిల్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా నైపుణ్యశిక్షణ ఇస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్‌, టి-ఫైబర్‌, సాఫ్ట్‌ నెట్‌, డిజిటిల్‌ మీడియా, ఓపెన్‌ డాటా, ఫోటోనిక్స్‌ వ్యాలీ కార్పొరేషన్‌ తదితర సంస్థలు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.