Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 03,2022

ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో లేదు

- జీపీలకు ప్రతినెలా నిధులిస్తున్నాం
- కేంద్రం రూ.1400 కోట్లు ఇవ్వాలి
- రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టాం : మంత్రి కేటీఆర్‌
- పల్లె, పట్టణ ప్రగతిలను జయప్రదం చేయండి
- స్వార్ధ రాజకీయాల కోసం పెండింగ్‌ బిల్లులపై దుష్ఫ్రచారం : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి బిల్లు కూడా పెండింగ్‌లో లేదని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీపీలకు ప్రతి నెలా నిధులిస్తున్నామనీ, ఇప్పటిదాకా రూ.10 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల నుంచి రూ.1400 కోట్లను విడుదల చేయడం లేదని చెప్పారు. పెండింగ్‌ బకాయిల కోసం కేంద్రం పైన బండి సంజరు దండెత్తాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మెన్లు, చైర్‌పర్సన్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చామనీ, పంచాయతీల్లో అవసరమైన ఉద్యోగాలను భర్తీచేసి పల్లెప్రగతిద్వారా అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నామన్నారు. జీపీలకు తమ ప్రభుత్వం ప్రతి నెలా స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నదని చెప్పారు. ఇప్పటిదాకా రూ.10 వేల కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చిన ఘతన తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ, దీన్ని తిప్పికొట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీ నిధులు, పెండింగ్‌ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు సైతం అసత్యాలను ప్రచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి సదాశివనగర్‌ సర్పంచ్‌కి సంబంధించిన విషయంలో నిధులు వచ్చినప్పటికీ డబ్బులు రాలేదని ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక అడిషనల్‌ కలెక్టర్‌ నియమించిన ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోతున్న ఏకైక మన ప్రభుత్వం మనదేనన్నారు. ఎర్రబెల్లి దయార్‌రావు మాట్లాడుతూ..పల్లెప్రగతిని జయప్రదం చేయాలని కోరారు. జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని స్పష్టం చేశారు. పల్లెప్రగతికి సంబంధించి ప్రజా ప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. బిల్లులు పెండింగ్‌ అనే ప్రస్తావనపై సోషల్‌ మీడియాలో, కొన్ని పత్రికల్లో రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా గ్రామాలలో ఈ ఏడాది రూ.900 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేశామని తెలిపారు. సర్పంచులు, గ్రామాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారనీ, కావాలని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం బిల్లులు పెండింగ్‌ అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి ఢిల్లీకి వెళ్లి నిధులు విడుదల కోసం అధికారును కలవాలని ఆదేశించామన్నారు. కొత్తసాఫ్ట్‌వేర్‌ల తో చెల్లింపులు ఆలస్యం కావడంతో పాటు అధికారులకూ విపరీత సమయం వృథా అవుతున్నదని చెప్పారు. ఈ కారణంగానే మెటీరియల్‌ కాంపోనెంట్‌కు సంబంధించిన బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతున్నదని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.