Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోరాటం వృథా కాదు.. ఎర్రజెండా మీకు అండ.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 04,2022

పోరాటం వృథా కాదు.. ఎర్రజెండా మీకు అండ..

- జక్కలొద్ది నిరుపేదలపై రౌడీలతో దాడులు దారుణం ..
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
        మీరు చేస్తున్న పోరాటం వృథా కాదని, మీకు ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం జక్కలొద్దిలో గుడిసెవాసుల పోరాటానికి మద్దతు తెలిపి ప్రసంగించారు. గురువారం రాత్రి పోలీసులు రౌడీలతో గుడిసెవాసులపై దాడి చేయించడాన్ని ఖండించారు. జక్కలొద్దిలో 296 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోందన్నారు. పక్క ఊరు వాళ్లను రెచ్చగొట్టి ప్రజలు తన్నుకునేలా చేయడం దుర్మార్గమన్నారు. ఈ పోరాటం జయప్రదం కావాలని, అరెస్టు అయిన నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మీ పోరాటానికి సంఘీభావం తెలపడానికి వస్తుండగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. తాను సమ్మక్క, సారలమ్మ జాతర చూడలేదని, ఇక్కడ మాత్రం సమ్మక్క, సారలమ్మ జాతరలా ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు నగరంలో ఇండ్లు కిరాయి ఇవ్వడం లేదని పలువురు మహిళలు చెప్పారని, ఇది బాధాకరమని తెలిపారు. బీజేపీ వాళ్లు మత విద్వేశాలు రెచ్చకొడుతున్నారన్నారు. పేదలకు భూములు లేకుండా చేశారన్నారు. పేదలపై దాడులు చేసిన రౌడీల వెనుక పెద్ద పెద్దోళ్లుంటారన్నారు. కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తానని ఎనిమిదేండ్లైనా నేటికీ ఇవ్వలేదన్నారు. వరంగల్‌ నగరంలో 2005లో రాజీవ్‌ గృహ కల్పలో 632 ఇండ్లను నిర్మించి నేటికీ 17 ఏండ్లైనా పేదలకు ఇవ్వలేదన్నారు. మనకు దక్కాల్సిన వాటా దక్కించుకునేలా పోరాటం చేయాలన్నారు. మీరెంత గట్టిగా పోరాడితే, మేం మీకు అంతా గట్టిగా మద్దతు ఇస్తామన్నారు.
కుల, మతాలు లేవు.. మనమంతా పేదలం : ఎస్‌. వీరయ్య
        కుల, మతాలు లేవని, మనమంతా పేదలమని, మీరంతా ఐక్యంగా పోరాటం చేస్తేనే ఇండ్ల స్థలాలు దక్కుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్న తరుణంలో ఇండ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తున్న నిరుపేదలపై రౌడీలను ఉసిగొల్పి పోలీసులు దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. మామునూరు సీఐ కరెంటు కట్‌ చేయించి మరీ దాడులు చేయించడం విచారకరమన్నారు. దారులన్నీ బంద్‌ చేసి పేదలను కొట్టిస్తారా అని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వస్తుంటే జక్కలొద్ది దారిలో ఎవరూ రాకుండా చెత్తను డంప్‌ చేయడం దేనికి సంకేతమన్నారు. గర్భిణీ స్త్రీలను సైతం కొట్టించడం దారుణమన్నారు. ఇంత భయానక పరిస్థితిని కల్పించినా 'మేం కదిలే ప్రసక్తే లేదని' మహిళలు మూకుమ్మడిగా చెప్పడాన్ని అభినందించారు. ఎర్రజెండా నీడలో మీ పోరాటం కొనసాగించాలన్నారు. జక్కలొద్దిలో 296 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 250 ఎకరాలను ఇప్పటికే కోటీశ్వరులు కబ్జా చేశారన్నారు. మీకు చేతనైతే 250 ఎకరాలు కబ్జా చేసిన వారిని ఖాళీ చేయించాలని సవాల్‌ విసిరారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ఇస్తామని చెప్పి పేదలకు ఇవ్వలేదన్నారు. నిర్మించిన ఇండ్లను సైతం లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడం దుర్మారగమన్నారు.
వరంగల్‌ పేదల పోరాటానికి 1100 కేంద్రాల్లో ప్రజల మద్దతు : పోతినేని
        మీరు చేస్తున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా 1,100 కేంద్రాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించి మీకు మద్దతు తెలిపారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ తెలిపారు. అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్నారని, రెండ్రోజులు మీరు మాతో ఉండండి.. పేదరికం, పేదలంటే ఏంటో తెలుస్తుందన్నారు. మన మీదకు వస్తే మీరు ఆత్మరక్షణకు ముందుకు కదలాలన్నారు. మీ పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని, మనం విజయం సాధిస్తామని భరోసానిచ్చారు.
గర్భిణీ స్త్రీని ముండ్ల కంచెలో నెట్టేశారు :రైనా సుల్తానా
        మా చెల్లె గర్భిణీ, షర్ట్‌ లేకుండా వచ్చిన ఒకతను కర్ర తీసుకొని కొట్టాడు. అడ్డుకుంటే బెదిరించడమే కాకుండా మా చెల్లెను ముండ్ల కంచెలో నెట్టేయడంతో కాళ్లకు ముండ్లు గీరుకుపోయి గాయపడింది. కొందరు కత్తులతో బెదిరించారు. మాకు తల్లిదండ్రులు లేరు.. అత్తమామలు లేరు.. సిటీలో ఇండ్ల కిరాయిలు కట్టలేక ఇండ్ల స్థలం కోసం ఇక్కడికి వచ్చాం.
ఎదురు తిరిగితే నా కడుపులో తన్నిండ్రు : మాధవి
        రాత్రి 20 మంది దాకా తాగి వచ్చిండ్రు. చేతల్లో సీసాలు, కర్రలున్నారు.. రమేశన్నను కొడుతుంటే అడ్డుకున్నందుకు నా కడుపులో తన్నిండు.. ఈలోపు సీసాతో రమేశన్న తల పగులకొట్టిండు.
ఎంజీఎంలో రమేశ్‌కు సీపీఐ(ఎం) నేతల పరామర్శ
        జక్కలొద్దిలో నిరుపేదలపై రౌడీలు చేసిన దాడిలో గాయపడ్డ రమేశ్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య, పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు, జగదీశ్‌, వరంగల్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌. రంగయ్య తదితరులు పరామర్శించారు. దాడి జరిగిన విధానంపై రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు.
పోలిస్‌ కమిషనర్‌కు వినతి
        జక్కలొద్ది నిరుపేదలపై రౌడీలతో దాడి చేయించిన సంఘటనపై సీపీఐ(ఎం) నేతలు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషిని శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. మామునూరు సీిఐ రౌడీలను రెచ్చగొట్టి నిరుపేదలపై దాడులు చేయించాడని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.