Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త పాఠ్యపుస్తకాలొచ్చారు... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 05,2022

కొత్త పాఠ్యపుస్తకాలొచ్చారు...

- తెలుగు, ఆంగ్ల మాధ్యమం కలిపి ముద్రణ
- పిల్లలకు అర్థమయ్యేలా ద్విభాషలో పాఠ్యాంశాలు
- జిల్లా కేంద్రాలకు చేరిన 20 లక్షలు పుస్తకాలు
- ఈనెలాఖరు నాటికి 70 శాతం పంపిణీ
- మిగతావి సెప్టెంబర్‌లో విద్యార్థులకు అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు పాఠ్యపుస్తకాల ముద్రణ వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 20 లక్షల పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. మిగతా పుస్తకాలు ఈనెలాఖరు వరకు 70 శాతం అంటే 1.20 కోట్ల పుస్తకాలు పాఠశాలలకు చేరతాయి. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నాయి. అప్పటి వరకు పాఠశాలలకు పుస్తకాలను చేర్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సర్కారు బడుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నది. దీంతో పాఠ్యపుస్తకాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమం (ద్విభాష)లో ముద్రించారు. అంటే ఒకే పుస్తకంలో రెండు భాషలకు చెందిన పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల సౌకర్యార్థం తెలుగులో చదువుకుని ఇంగ్లీష్‌లో ఉన్న పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల పుస్తకాల ముద్రణలోనూ మార్పులొచ్చాయి. రెండు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) వారీగా పుస్తకాలను ముద్రించారు. అంటే ఎస్‌ఏ-1కు పార్ట్‌-1 పుస్తకం, ఎస్‌ఏ-2కు పార్ట్‌-2 పుస్తకాలను రూపొందించారు. అంటే విద్యార్థులకు ఇప్పటి వరకు ఒక సబ్జెక్టుకు ఒకే పుస్తకం ఉండేది. ఇకనుంచి ఒక సబ్జెక్టుకు రెండు పుస్తకాలను ముద్రిస్తున్నారు. అందుకే ఈ నెలాఖరునాటికి 1.67 కోట్ల పార్ట్‌-1 పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేస్తారు. మిగిలిన 43 లక్షల పార్ట్‌-2 పుస్తకాలు సెప్టెంబర్‌ 15 నాటికి విద్యార్థులకు అందజేస్తారు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఉచిత పాఠ్యపుస్తకాల మీద సీరియల్‌ నెంబర్‌ (యూనిక్‌ కోడ్‌)ను ముద్రిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఉచిత పాఠ్యపుస్తకం ఏ విద్యార్థికి ఇస్తున్నారో వివరాలు అందుబాటులో ఉంటాయి. ఒక్క పుస్తకమూ దుర్వినియోగం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధికారుల తీరుతో ఆలస్యం
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు కలిపి సుమారు 40,898 వరకు ఉన్నాయి. వాటిలో 60 లక్షల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో కలిపి 26 లక్షల వరకు ఉన్నారు. వారి కోసం 2.10 కోట్ల పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా ఏప్రిల్‌లోనే టెండర్లను ఆహ్వానించారు. ఎక్కువ ధర కోడ్‌ చేయడంతో రెండోసారి టెండర్లను పిలవాల్సి వచ్చింది. దీంతో ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ మేలో ప్రారంభమైంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వం కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. తమిళనాడు, పంజాబ్‌, చండీఘర్‌ నుంచి పేపర్‌ రావడమూ ఆలస్యానికి మరో కారణంగా ఉన్నది. త్వరగా టెండర్లను ఖరారు చేసి పాఠ్యపుస్తకాల ముద్రణను ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పుస్తకాల ముద్రణ పూర్తయ్యేది. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండేవి. కానీ ఈ ఏడాది ఆలస్యం కావడం గమనార్హం. ఇంకోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారుల తీరు వల్ల ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలల్లో అమ్మకానికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తర్వాత ప్రయివేటు ప్రింటర్లకు అనుమతులు వస్తాయి. అప్పుడు ముద్రణ ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఇప్పటికే మార్కెట్‌లో ప్రయివేటు పాఠశాలలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉండాలి. ఇంకా ముద్రణ ప్రారంభం కాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి 1.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అమ్మకం కోసం అవసరమని అధికారులు అంచనా వేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.