Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శి మల్లయ్య బట్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88శాతం విద్యార్థులు హాజరయ్యారని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45735 మంది దరఖాస్తు చేసుకోగా, 40575 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా, 5144 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు.