Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వాల విధానాలు మారితేనే పర్యావరణ పరిరక్షణ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 06,2022

ప్రభుత్వాల విధానాలు మారితేనే పర్యావరణ పరిరక్షణ

- ఐక్య ఉద్యమాలతోనే విధానాల్లో మార్పు సాధ్యం
- పట్నం సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           ప్రభుత్వాల విధానాలు మారినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాద్యమవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోరుకునే వ్యక్తులు, సంస్థలు కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహించినప్పుడే ఆ మార్పు సాధ్యమవుతుందని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక - పట్నం రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవివిఎస్‌ఎన్‌ రాజు అధ్యక్షతన పర్యావరణ మార్పులు - భవిష్యత్‌ కర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఫోరం ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌ చైర్మెన్‌, అర్బన్‌ అండ్‌ రీజినల్‌ ప్లానర్‌ వేదకుమార్‌ మణికొండ, విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్‌ కె.సత్యప్రసాద్‌, సామాజిక విశ్లేషకులు డాక్టర్‌ అందె సత్యం మాట్లాడారు. ప్రభుత్వాలు పైకి పర్యవరణాన్ని పరిరక్షిస్తున్నట్టు మాటలు చెబుతూ, విధానాలతో విధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు.
           సత్యప్రసాద్‌ మాట్లాడుతూ గత 50 ఏండ్లుగా పర్యావరణంపై ప్రపంచ దేశాలు సదస్సులు పెట్టుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం తప్ప అమలు చేయలేదని విమర్శించారు. దీంతో పర్యావరణం మరింత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1990లో సోవియట్‌ యూనియన్‌ పడిపోయిన తర్వాత ధనిక దేశాల కర్రపెత్తనం పెరిగాక పర్యావరణ పరిరక్షణ వెనుకపడిందని చెప్పారు. ప్యారీస్‌ ఒప్పందం, ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ నివేదిక ప్రపంచం ప్రమాదంలో పడిందని హెచ్చరించినా పట్టించుకునే స్థితిలో ఆ దేశాలు లేవన్నారు. గ్రీన్‌ హౌస్‌ కాలుష్యానికి ఒక్క అమెరికానే 60 శాతం కారణమనీ, చాలా దేశాలు ఒక శాతంలోపే ఉన్నాయని తెలిపారు. అందరూ కారణమంటూ తప్పుడు విశ్లేషణలు చేయొద్దని కోరారు. ప్యారీస్‌ ఒప్పందం అమలు కాకుండా అమెరికా నాయకత్వంలోని దేశాలు అడ్డుపడ్డాయని విమర్శించారు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది చనిపోతున్నా అమానవీయ విధానాలను అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ విదేశాల్లో సదస్సులకు పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ మాటలు చెప్పి, దేశంలో బాక్సైట్‌ తవ్వకాలకంటూ అడవులను నరికేందుకు అనుమతిస్తున్నారని చెప్పారు. ఇటీవల అనకాపల్లి గ్యాస్‌ లీకేజీతో 300 మంది బాధితులుగా మారారని ఉదహరిస్తూ, తమదాక వస్తే తప్ప కదలమనే ఆలోచన ప్రజలు మానుకోవాలని సూచించారు.
ఐక్యంగా ఉద్యమిద్దాం....వేదకుమార్‌
           ఒంటరిగా నిలదీసినా, ప్రశ్నించినా ప్రభుత్వాలు పట్టించుకోవని వేదకుమార్‌ తెలిపారు. ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌ ద్వారా గత 20 ఏండ్ల తమ అనుభవంతో ఇది స్పష్టమైందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోరుకుంటున్న వారంతా అంశాల వారీగా ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లోకి నేరుగా కార్పొరేట్లు ప్రవేశించడం, వారి గొంతుకే ప్రభుత్వ విధానాలుగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. హుస్సేన్‌ సాగర్‌పై 18 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేస్తే ఆరో ప్రాజెక్టు వద్ద ఆపగలిగామని తెలిపారు. హైదరాబాద్‌కు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను 1980 నుంచి ఒక్కసారి కూడా సవరించలేదని తప్పుపట్టారు. దీన్ని పదేండ్లకు ఒకసారి సవరించాల్సి ఉందని తెలిపారు. ఆరు మాస్టర్‌ ప్లాన్లు ఉన్న ఏకైక నగరం హైదరాబాద్‌ అనీ, అయితే సరైన మాస్టర్‌ ప్లాన్‌ మాత్రం లేదని విమర్శించారు. ముందుగా అంచనా వేసిన దాని కన్నా జనాభా ఎక్కువగా పెరగడం, మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయకపోవడం, రాజకీయ పార్టీల స్వార్థ్యం కోసం పారిశ్రామికీకరణను ఇష్టానుసారంగా అనుమతించడం హైదరాబాద్‌కు కష్టాలు తెచ్చిపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ ఎజెండాగా మారాలి..... డాక్టర్‌ అందె సత్యం
           రాజకీయ ఎజెండాగా మారిన పర్యావరణ ఉద్యమాలు విజయవంతమయ్యాయని డాక్టర్‌ అందె సత్యం తెలిపారు. మూడు అడవులను కనబడకుండా చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తే యురేనియం తవ్వకాలను నిలిపేసి నల్లమల అడవిని, బాక్సైట్‌ తవ్వకాలను నిలిపేసి మన్యం అడవులను కాపాడగలిగామని చెప్పారు. అయితే పోలవరం పేరుతో దండకారణ్యంలో లక్షల ఎకరాల అడవులను లేకుండా చేశారని చెప్పారు. మద్యనిషేధ ఉద్యమం, ఉచిత విద్యుత్‌ ఉద్యమం రాజకీయ ఎజెండాగా మారినందునే గత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి వాటిని అమలు చేశారని చెప్పారు. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షకులుగా పైకి కనిపిస్తూ ప్రజలకు అర్థం కాకుండా లోపల విధ్వంసకర కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఐదు లక్షల మంది పారిశుధ్య కార్మికులను నియమించకుండా, స్వచ్ఛభారత్‌ పేరుతో ప్రచారం చేసుకు న్నారని ఉదహరించారు. పర్యవరణం దెబ్బతింటుండటంతో పేదలు బలవుతున్నారనీ, ధనవంతులు తమను తాము కాపాడుకుంటున్నారని సోదాహరణంగా వివరించారు. ఈ నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పట్నం ప్రధాన కార్యదర్శి డీ.జీ.నర్సింహారావు కార్యక్రమానికి స్వాగతం పలికారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.