Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 07,2022

పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

కేంద్రప్రభుత్వం సహకరించాలి
- ఎన్నికలప్పుడే రాజకీయాలు..
- అప్పటి వరకూ అభివృద్ధిలో పోటీ పడదాం
- పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక ఆవిష్కరణ సభలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
          పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవు తుందనీ, తమ ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదనీ, లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సర పరిశ్రామల శాఖ వార్షిక నివేదికను సోమవారంనాడిక్కడి ఓ హౌటల్‌లో ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐఐ, ఎఫ్‌ఐసీసీఐ, డీఐసీసీఐ, ఎఫ్‌టీసీసీఐ, అలీప్‌, కోవా, అసోచామ్‌ సహా పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రావతరణ నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో సాధించిన ప్రగతిని గణాంకాల ద్వారా వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, ఆ విధానంతో 2021-22లో 3,938 పరిశ్రమల ద్వారా రూ.17,867 కోట్ల పెట్టుబడులను రాబట్టి, 96,863 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా 13 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశామనీ, 526 పరిశ్రమలకు 810 ఎకరాల భూమిని ఇచ్చి, రూ.6,123 కోట్ల పెట్టుబడులను ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,626 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2021-22లో ఏర్పాటైన పలు పరిశ్రమల పేర్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చేనేతరంగానికి ప్రభుత్వం ఇస్తున్న చేయూతను వివరించారు. ఆరంగంలో వచ్చిన పెట్టుబడులను వివరించారు. కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలనూ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) ప్రధాన భూమిక పోషిస్తాయనీ, రంగాల వారీగా వాటిని విభజించి, ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నదనీ, వారు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ కేంద్రప్రభుత్వ వైఖరే తమను కొంత ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలనీ, ఆ తర్వాత ప్రభుత్వాలు అభివృధ్ధిపైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆరు పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటుకు తాము కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, ఇప్పటి వరకు వాటికి అనుమతులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలనీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటే విమర్శలు చేయక తప్పట్లేదన్నారు. నూతన ఆవిష్కరణలు, సౌకర్యాల కల్పన, సమ్మిళిత వృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, ఆ దిశగానే పరిశ్రమల ఏర్పాటు, అభివృధ్ధి జరుగుతున్నదని వివరించారు. కార్యక్రమంలో అంతకుముందు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రికల్‌ వాహనాల విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు సంస్థలతో అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. హ్యాండ్‌లూం, టెక్స్‌టైల్‌, హ్యాండీక్రాఫ్ట్‌ శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాష్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డీ కృష్ణభాస్కర్‌, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.