Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీజీ కాలేజీలు 'ఖాళీ'! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 07,2022

పీజీ కాలేజీలు 'ఖాళీ'!

సగం సీట్లూ నిండని వైనం
- గతేడాది 44,604 సీట్లలో 22,763 భర్తీ
- ఎంకామ్‌లో 8 వేలకు 3 వేల మందే చేరిక
- విశ్వవిద్యాలయాలు, పట్టణాల్లోనే చేరేందుకు ఆసక్తి
- గ్రామీణ ప్రాంత కాలేజీలకు ఆదరణ కరువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             రాష్ట్రంలో పీజీ కాలేజీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సీట్లు నిండక కోర్సులను నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కాలేజీల్లో విద్యార్థుల్లేక తరగతి గదులు ఖాళీగా కనిపిస్త్తున్నాయి. సగం సీట్లు సైతం నిండని పరిస్థితి ఉండడమే ఇందుకు నిదర్శనం. 2021-22 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో 44,604 సీట్లుంటే, 22,812 (51.14 శాతం) మంది విద్యార్థులే ప్రవేశం పొందారు. ఇందులో 16,163 (71 శాతం) మంది అమ్మాయిలు, 6,649 (29 శాతం) అబ్బాయిలు ఉన్నారు. అంటే పీజీ కోర్సుల్లో 21,792 (48.86 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకోవైపు విశ్వవిద్యాలయాలకు చెందిన కాలేజీలు, నగరాలు, పట్టణాల్లోని కాలేజీల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత విద్యావకాశాలు, ఇంగ్లీష్‌లో పట్టు పెంచుకోవడం, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో వారు ఈ విధంగా చేరుతున్నారు. ఇంకోవైపు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, బోధనా పద్ధతుల్లో వస్తున్న మార్పులు వంటి అంశాలపైనా నగరాలు, పట్టణాల్లో ఉంటే అవగాహన ఎక్కువుంటుంది. మరోవైపు చదువుతూనే ఉద్యోగాలు చేయడం, ఉద్యోగాలకు సంబంధించిన మెళకువలు నేర్చుకోవడం, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం, కోచింగ్‌లకు వెళ్లడం వంటి అదనపు అవకాశాలుంటాయి. ఈ కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో అక్కడ ఉండే కాలేజీలు దివాళా తీస్తున్నాయి. వాటిని మూసుకోలేక, విద్యార్థులు చేరక కాలేజీ యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
తక్కువ మందితో కోర్సులను నడపలేని పరిస్థితి
             ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో విద్యాహబ్‌కు ప్రసిద్ధి. ఆ ప్రాంగణంలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది. అయితే 2021-22 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఆ కాలేజీలో ఐదుగురు అమ్మాయిలు చేరారు. దీంతో అక్కడ ఆ కోర్సును నడపలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులతో ఉన్నత విద్యాశాఖ, విశ్వవిద్యాలయ అధికారులు సంప్రదించి ఇతర కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నించారు. అందులో నలుగురు విద్యార్థినిలు సరే అన్నారు. కానీ ఒక విద్యార్థిని మాత్రం ఇక్కడ కాకపోతే చదువు మానుకోవాల్సి వస్తుందని చెప్పడం అధికారులను ఆలోచింపచేసింది. ఇలా తక్కువ మంది విద్యార్థులు చేరితే ఆ కోర్సులను నడపలేని పరిస్థితి కాలేజీ యాజమాన్యాలకు ఉంటుంది. సైన్స్‌ కోర్సులైతే ఆర్థికంగా భారమవుతాయి. ప్రభుత్వ కాలేజీల్లో తక్కువ మంది చేరితే అధ్యాపకుల సేవలు వారి వరకే పరిమితమవుతాయి. ఇలా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2021-22 విద్యాసంవత్సరంలో కన్వీనర్‌ కోటాలో ఎనిమిది వేల సీట్లుంటే మూడు వేల మంది విద్యార్థులే చేరారు. అంటే ఐదు వేల సీట్లు మిగిలాయి. ఇలా చాలా కోర్సుల్లో ఏటా సీట్లు మిగులుతున్నాయి. ఇది ఆందోళనకరంగా ఉన్నది.
ప్రవేశాలు పెంచేందుకు చర్యలు : లింబాద్రి
             పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి చెప్పారు. డిగ్రీతోపాటు ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చదివిన విద్యార్థులు సంప్రదాయ పీజీ కోర్సులవైపు వచ్చేందుకు గతనెల 16న వీసీల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. సోషల్‌ సైన్సెస్‌తోపాటు ఎంఏ తెలుగు, ఇంగ్లీష్‌లో చేరాలంటే ఏదైనా డిగ్రీ చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షించేందుకు నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను ప్రవేశపెట్టామని వివరించారు.
పది మందిలోపు చేరితే వేరే కాలేజీకి మార్చాలి : పాండురంగారెడ్డి
             పది మందిలోపు విద్యార్థులు చేరితే ఆ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి విద్యార్థులను చేర్పించే విధానాన్ని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి రూపొందించాలని సీపీజీఈటీ కన్వీనర్‌ ఐ పాండురంగారెడ్డి చెప్పారు. తక్కువ మంది విద్యార్థులు చేరితే తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఇది అటు కాలేజీలు, ఇటు విద్యార్థులకు నష్టమని వివరించారు. విశ్వవిద్యాలయాల కాలేజీల్లో ఎక్కువ మంది చేరుతున్నారనీ, అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేరడం లేదన్నారు. ఓయూ పరిధిలో 15,339 సీట్లుంటే, 9,177 మందే విద్యార్థులు చేరారని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.