Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భద్రత కల్పించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 08,2022

భద్రత కల్పించాలి

- గిగ్‌ వర్కర్ల విషయంలో పెరుగుతున్న డిమాండ్‌
- ఫుడ్‌ డెలివరీ కంపెనీల విధానాలతో ఇప్పటికే అనేక ఇబ్బందులు
- కార్మికుల ప్రాణాల మీదకు 'నిమిషాల్లో డెలివరీ' హామీ
న్యూఢిల్లీ : కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ వారి భద్రతను విస్మరిస్తున్నాయి ఫుడ్‌ డెలివరీ కంపెనీలు. ఇతర కంపెనీలతో పోటీని తట్టుకొని కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో డెలివరీ బార్సుపై ఒత్తిళ్లను పెంచుతున్నాయి. ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ సదరు కంపెనీలు కొన్ని రోజుల క్రితం వరకు ప్రకటనలను ఇచ్చాయి. దీంతో కంపెనీల ప్రకటనలకు గిగ్‌ కార్మికులు బాధితులుగా మిగిలారు. ఆర్డర్‌ను కస్టమర్లకు నిర్ణీత సమయంలోగా అందించే క్రమంలో వారు రోడ్డు ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం. ప్రాణాలూ కోల్పోయారు. సదరు ఫుడ్‌ డెలివరీ కంపెనీలు తీరుపై గిగ్‌ కార్మికులూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు కంపెనీల తీరును తప్పుబట్టాయి. అస్తవ్యస్త డెలివరీ విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలు ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశాయి. గిగ్‌ కార్మికులకు భద్రతను, కనీస హక్కులను కల్పించాలని తెలిపాయి. రోజురోజుకూ ఈ డిమాండ్‌ క్రమంగా పెరుగుతున్నది.
'పది నిమిషాల్లో డెలివరీ'తో కష్టాలు
              గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ కంపెనీల 'పది నిమిషాల డెలివరీ' మోడల్‌ చర్చనీయాంశంగా మారింది. కస్టమర్లకు నిర్ణీత సమయంలోగా, వేగంగా ఆర్డర్లను వారి ఇంటి ముందుకు తీసుకెళ్లి అందించటంలో భాగంగా ఫుడ్‌, గ్రోసరీ డెలివరీ సంస్థలు ఈ విధానాన్ని తీసుకొచ్చాయి. నిమిషాల్లో డెలివరీని కస్టమర్లకు అందించటం కోసం డెలివరీ కార్మికులు వాహనాలపై వేగంగా వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంకోవైపు, నిర్ణీత సమయంలోగా ఆర్డర్లను కస్టమర్లకు చేర్చకపోతే అందుకు వేతనాల్లో కోతలను కార్మికులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
వెనక్కి తగ్గిన సంస్థలు
              అయితే, డెలివరీ వర్క్‌ఫోర్స్‌ కొరత, పెరిగిన ఇంధన ధరలు వంటివి ఇలాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల సర్వీసులకు ఆటంకం కలిగిస్తున్నాయని ఒక వార్త సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. దీంతో వివాదాస్పద 'వేగవంతమైన డెలివరీ'లకు ఫుడ్‌ డెలివరీ కంపెనీలు దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
15 మంది కార్మికులు మృతి.. కంపెనీలు బాధ్యత వహించాలి.
              కంపెనీల అత్యుత్సాహ హామీలపై గిగ్‌ వర్కర్స్‌ యూనియన్లు, ఫెడరేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ అంచనాల ప్రకారం గత రెండు, మూడు నెలల్లో దేశవ్యాప్తంగా 10 నుంచి 15 మంది కార్మికులు కంపెనీల తీరుతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌-బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి ఫుడ్‌ డెలివరీ కంపెనీలు ఎందుకు బాధ్యత వహించవు? అని ఆయన ప్రశ్నించారు. కంపెనీల మార్కె టింగ్‌ జిమ్మిక్కుతో కార్మికులు వేగంగా వాహ నాలను నడుపు కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, దీంతో వారు ట్రాఫిక్‌ నిబం ధనలను బ్రేక్‌ చేయటం, ప్రమాదాలకు గుర వటం జరుగుతోందని ఆలిండియా గిగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐజీడబ్ల్యూయూ)కు చెందిన స్పందనా ప్రత్యూష్‌ తెలిపారు. ఈ క్రమంలో వారికి సామాజిక భద్రత మాత్రమే కాదు.. కొన్ని కనీస హక్కులు, వృత్తిపరమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, తమ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు సలావుద్దీన్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.