Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-తాండూరు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోచపోచగూడ ఆదివాసీ మహిళలపై అటవీ అధికారులు కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తాండూరు ఐబీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దాగాం రాజారాం మాట్లాడుతూ.. కోయపోచగూడ గిరిజనులు 2005 కంటే ముందు నుండే పోడు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు అటవీ అధికారులు అక్రమ కేసులు పెట్టి 12 మంది మహిళలను జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే వారిపై కేసులను ఎత్తేయాలని, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, నాయకులు బొల్లం రాజేశం, చంద్రయ్య, రాములు, బాపు, తిరుపతి పాల్గొన్నారు.