Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రమబద్ధీకరణ వ్యతిరేక పిటిషన్‌ కొట్టివేత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 08,2022

క్రమబద్ధీకరణ వ్యతిరేక పిటిషన్‌ కొట్టివేత

- కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా నమోదు చేసిన పిటిషన్‌ 23379/ 2022ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ నిర్ణయం పట్ల జీవో నెంబర్‌ 16, కాంట్రాక్టు ఉద్యోగులు/ అధ్యాపకుల క్రమబద్ధీ కరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ హర్షం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చలరర్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 16ను రద్దు చేయాలంటూ వి ఉమేష్‌తోపాటు మరో ముగ్గురు వేసిన పిటిషన్‌ 23379/2022పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రభాశంకర్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావలితో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా 20 ఏండ్లకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు పనిచేస్తున్నారనీ, వారి సర్వీసులు క్రమబద్ధీకరించవద్దా?అని పిటిషనర్లను ఆ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంపై మాటి, మాటికీ కేసులు వేయడం సమంజసం కాదని సూచించింది. అనంతరం ఆ పిటిషన్‌ను కొట్టేసింది.
సీఎం జోక్యం చేసుకోవాలి
            రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకోవాలనీ, క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటానికి చూస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శ్రమదోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించడానికి సీఎం 2016లో జీవో నెంబర్‌ 16 జారీ చేశారని తెలిపారు. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ విషయంపై హైకోర్టులో వేసిన కేసు వల్ల దాదాపు ఆరేండ్లపాటు క్రమబద్ధీకరణ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందని పేర్కొన్నారు. 2021, డిసెంబర్‌లో క్రమబద్ధీకరణకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయని గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా గురించి మూడు నెలల క్రితం అన్ని శాఖలకూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు పంపిందని తెలిపారు. కానీ ప్రధానమైన వైద్య ఆరోగ్య శాఖ, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల కమిషనరేట్‌ నుంచి ఇంతవరకూ సంబంధిత జాబితా సచివాలయానికి పంపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో కొంతమంది అనధికార వ్యక్తులు, కొందరు అధికారులను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూ ర్వకంగా జాబితా పంపించడంలో జాప్యం చేయిస్తు న్నారని విమర్శించారు. కొంతమంది దళారుల చేత కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను భయపెడు తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. క్రమబద్ధీకరణ జాప్యం చేయడానికి కొంద రికి డబ్బులిచ్చి న్యాయస్థానాల్లో కేసులు వేయిస్తు న్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే లా చర్యలు తీసుకోవాలని సమితి కోకన్వీనర్లు శ్రీనివాస్‌, శోభన్‌బాబు, ఉదయభాస్కర్‌ కోరారు.
            హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న తెలిపారు. కొందరు ఈ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేసులు వేస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.