Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర హౌం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారంన ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పాటు రవీంద్రభారతీలో ఈ ఉత్సవాలను నిర్వహించే విషయంలో తాను పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రితో, ఉన్నతాధికారులతో చర్చిస్తానని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు సన్నాహక కమిటీని నియమించు కోవాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఇంటర్ మీడియట్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ, ప్రముఖ ఉర్దూ విద్యావేత్త, ప్రొఫెసర్ ఎస్.ఏ.షుకుర్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతీఖ్ అహ్మద్, ఫ్యాప్సి మాజీ అధ్యక్షులు అనీల్ రెడ్డి, టీయుడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ఏ.మాజీద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.