Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇండ్ల స్థలాలు ఇచ్చే దాకా పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 09,2022

ఇండ్ల స్థలాలు ఇచ్చే దాకా పోరాటం

- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-వరంగల్‌
ఖిలావరంగల్‌ మండలం జక్కలొద్దిలో పేదోళ్ల గుడిసెలను పోలీసులు దౌర్జన్యంగా బుల్డోజర్లతో ధ్వంసం చేయడంపై సీపీఐ(ఎం) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట పేదలు వేసుకున్న గుడిసెలను వందలాది మంది పోలీసులు బుధవారం తెల్లవారుజామున చీకట్లోనే వచ్చి తగలబెట్టారు. గుడిసెల్లోకి చొరబడి గుడిసెవాసులను భయభ్రాంతులకు గురిచేసి 1100 మందిని అరెస్టు చేసి మడికొండ పోలీస్‌ ట్రైనింగ్‌ కేంద్రానికి తరలించారు. గుడిసెలను పెట్రోల్‌, డీజిల్‌ పోసి దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నేతలు జక్కలొద్దికి చేరుకుని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలవాసులంతా అసంఘటితరంగ కార్మికులు అని, బీడీలు చుట్టడం, భవన నిర్మాణ కూలి పనులు, హోటళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని చెప్పారు. ఇంటి కిరాయి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడిన వారు జక్కలొద్దిలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారని తెలిపారు. భర్త కూలికి పోతే భార్య గుడిసె వద్ద ఉండి గుడిసెను కాపాడుకుంటున్నారని చెప్పారు. ఇంటి స్థలం వస్తుందనే ఆశతో పేదలుంటే.. బుధవారం తెల్లవారుజామున చీకట్లో పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలపై డీజిల్‌, పెట్రోల్‌ పోసి తగలబెట్టడం దుర్మార్గమన్నారు. పోలీసుల దుశ్చర్యతో పేదలు భయంతో చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెల్లో ఉన్న వంట సామగ్రి, మంచాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు, కోడి పిల్లలు, ఇతరత్రా సామానులు అగ్గిలో ఆహుతయ్యాయని చెప్పారు. ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయో అధికారులకు తెలుసన్నారు. బడా రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తీసుకోకుండా పేదలు వేసుకున్న గుడిసెలను దహనం చేయడం దారుణమన్నారు. నెలరోజుల నుంచి కరెంటు లేక, నీళ్లు లేక పోయినా ఇబ్బందులు పడుతూ ఇంటి స్థలం వస్తుందని అప్పులు తెచ్చుకుని గుడిసెలు వేసుకున్నారన్నారు.
గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు రాజీవ్‌ గృహకల్ప ఇండ్లను నిర్మించి.. ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి తలుపులు కిటికీలు ధ్వంసమయ్యాయన్నారు. పేదల ప్రభుత్వం, బంగారు తెలంగాణ అంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదలపై మానవత్వం లేకుండా ఇలాంటి దాష్టీకానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. అరెస్టు అయిన పేదలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి పేదల ఇండ్ల స్థలాల పట్ల సానుకూలంగా స్పందిందాలని కోరారు.
అధికారులు అండతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం :
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జి.రాములు
పోలీస్‌, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములను బడా రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జి.రాములు అన్నారు. గతంలో సుందరయ్య నగర్‌, ఏసీ రెడ్డినగర్‌ వంటి ఎన్నో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేసిన గుడిసెలతోనే ఏర్పడ్డాయన్నారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి దారుణం, దుర్మార్గం జరగలేదన్నారు. ఈ ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులకు అంటగట్టడానికే ఇలాంటి దారుణమైన చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పేదలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రంగయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు బాబు, నలిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, ఆరూరి కుమార్‌, రత్నం, హైమద్‌, రాణి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.