Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎరువు కరువేనా..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 10,2022

ఎరువు కరువేనా..!

కేంద్రం ఫెర్టిలైజర్‌ పాలసీ లోపాలతో పొంచివున్న ముప్పు
- ఏప్రిల్‌, మే నెలవారీ కోటాలో కోత
- బ్లాక్‌ తప్పదని రైతుల ఆందోళన
- తప్పని నకిలీ విత్తనాల బెడద
        వ్యవసాయ సీజన్‌(వానాకాలం)కు ఆదిలోనే ఎరువుల(యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, పొటాషియం) సమస్య వచ్చేలా ఉంది. కేంద్రం ఫెర్టిలైజర్‌ పాలసీ లోపాల కారణంగా ఈ ఏడాది ఎరువుల కొరత పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి తగినట్టే రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ఎరువుల కోటాలో కోతపడింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
        రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి 38 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని రైతుసంఘాలు చెబుతున్నాయి. వానాకాలం సీజన్‌కు 23.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కావాలి. కేంద్రం వివిధ కారణాలు చూపి అవసరమైనంత ఎరువులను రాష్ట్రానికి సకాలంలో పంపడం లేదని అధికారవర్గాల సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నెలవారీ ఎరువుల కోటాలో ఏప్రిల్‌, మే నెలల్లో కోత పడింది. రావాల్సిన దానికంటే ఎరువు బాగా తగ్గిందని అధికారులు తెలిపారు.. గత సీజన్‌లో డీ అమ్మోనియం ఫాస్పేట్‌ (డీఏపీ) కోసం రైతులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈసారీ అదే పరిస్థితి పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎరువుల ధరలు కూడా విచ్చలవిడిగా పెరిగాయి. ఫలితంగా స్టాక్‌ నిల్వ చేసుకునేందుకు డీలర్లు ముందుకు రావడం లేదు.వరంగల్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో వానాకాలం సీజన్‌ ఈ నెలలో ఆరంభమవుతుంది. మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలోనూ అక్కడక్కడా పనులు ప్రారంభించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో జులైలో ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో స్టాక్‌ పెట్టుకునేందుకు కూడా డీలర్లు వెనుకాడుతున్నారు. మరోవైపు కోఆపరేటివ్‌ సొసైటీలు కూడా గతంలో లాగా ఖాతా పెట్టే పరిస్థితి లేదని మార్క్‌ఫెడ్‌ సూచించింది. ఇవన్నీ రాబోయే ఎరువుల కొరతకు సంకేతాలుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తొలకరి పలకరిస్తే విత్తనం.. ఎరువుతోనే పని
        మృగశిర కార్తె ఆరంభంతో వర్షాకాలం బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలకరి పలకరిస్తే విత్తనాలు, ఎరువులతోనే పని. రాగల 48 గంటల్లో వర్ష సూచనలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తోంది. చినుకు రాలితే సాగు పనులు జోరందుకుంటాయి. ఈ సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా యూరియా 10.5 లక్షల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 2.16 లక్షల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 9.5 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎరువులు అవసరం ఉంది.
        ఖమ్మం జిల్లాలో ఈ వానాకాలంలో 5,91,700 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 85వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 34,657 మె||ట డీఏపీ, 24,889 మె||ట ఎంవోపీ, 1.37 లక్షల మె||ట కాంప్లెక్స్‌ ఎరువులు, ఎన్‌ఎస్‌పీ 12,510, ఇలా మొత్తంగా 2.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. సిద్దిపేటలో 1.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మే నెల నాటికి రావాల్సిన ఎరువుల్లో భారీగా కోత పడింది.
        జిల్లాలో 5,44,726 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. దీనిలో అత్యధికంగా పత్తి 1.75 లక్షల ఎకరాలు, వరి 1.71 లక్షలు, మొక్కజొన్న 60వేలు, ఆయిల్‌పాం 53వేలు, మిరప 22వేలు, ఇతరత్ర పంటలు 55వేల ఎకరాలకు పైగా సాగవుతాయని అంచనా. వీటికి 1,25,330 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అని అంచనా వేయగా, 33,991 మెట్రిక్‌ టన్నుల ఎరువులు మాత్రమే మే 16వ తేదీ నాటికి అందుబాటులోకి వచ్చాయి.

కొరత లేకుండా చూస్తాం
        మే నెల వరకు రావాల్సిన ఎరువుల కన్నా తక్కువ వచ్చిన మాట వాస్తవమే. ఎంవోపీ కొరత ఎక్కువగా ఉంది. సీజన్‌ ప్రారంభమే కాబట్టి దీన్ని అధిగమించొచ్చు. ఎరువుల అవసరం ఎక్కువగా ఉండే సమయానికి కమిషనర్‌తో మాట్లాడైనా కొరత లేకుండా చూస్తాం.
-ఎం.విజయనిర్మల :ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి

సబ్సిడీ మిగుల్చుకోవాలనే ఎత్తుగడ
        సబ్సిడీ మిగుల్చుకోవాలనే ఎత్తుగడతో కేంద్ర ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తోంది. బ్లాక్‌ మార్కెట్‌కు ఎరువును తరలించి వ్యాపారులు బాగుపడేలా కేంద్రం వ్యవహారం ఉంది కానీ రైతులను దృష్టిలో పెట్టుకోవడం లేదు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే పేరుతో ఎరువులు అందుబాటులో లేకుండా చేస్తోంది. రైతును దెబ్బతీసే ఇటువంటి పనికిమాలిన చర్యలకు పోకుండా గత సీజన్‌లో ఎంత ఎరువులనైతే సరఫరా చేశారో తదనుగుణంగా సఫ్లరు చేయాలి.
- బొంతు రాంబాబు
   తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి


ధరల పెంపు దృష్ట్యా నిల్వలు తగ్గించాం
        ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 30 నుంచి 40 శాతం ధరలు పెరగడంతో ముందస్తు పెట్టుబడి పెట్టి స్టాక్‌ తెచ్చుకుని నష్టపోలేం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా ముడిసరుకు కొరత దృష్ట్యా ఎరువుల ధరలు గతేడాది కంటే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంతకు ముందులా ఒక్కో డీలర్‌ ముందుగానే రూ.10లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి నిల్వ చేసుకునే పరిస్థితి లేదు.
- పుల్లఖండం నాగేందర్‌రావు
  ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌
  ఖమ్మం జిల్లా కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.