Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత పద్మశ్రీ సురభి నాగేశ్వరరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. సంగీత, నాటకరంగానికి శతాబ్ధానికిపైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడుగా, నాటక రంగానికి నాగేశ్వరరావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదని కొనియాడారు. ఆయన మరణం నాటకరంగానికి తీరనిలోటని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.