Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బుల్డోజర్‌ బ్యాచ్‌కు వ్యతిరేకంగా పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 14,2022

బుల్డోజర్‌ బ్యాచ్‌కు వ్యతిరేకంగా పోరాటం

- విద్య, ఉపాధి కల్పనపై దృష్టిపెట్టట్లేదు
- భగత్‌సింగ్‌ పాఠ్యాంశం తొలగించడం సరిగాదు
- మత రాజకీయాలతో బీజేపీ పబ్బం
- డిసెంబర్‌లో తెలంగాణలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు : అఖిల భారత అధ్యక్షులు వీపీ సానూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             దేశంలో విద్య, ఉపాధి కల్పన, మహిళా, ఇతర సమస్యలపై దృష్టి పెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మత రాజకీయాలను తిప్పకొడతామనీ, బుల్డోజర్‌ బ్యాచ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు వీపీ సానూ చెప్పారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణ చేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. విద్యాపరిరక్షణ, ఉపాధి కల్పన కోసం దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతంగా చేయనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్‌ నెలలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు తెలంగాణలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ప్లీనం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జెండా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి ఎగురవేశారు. ప్లీనంలో, మీడియాతో సానూ మాట్లాడుతూ..మతం చుట్టూ రాజకీయాలు చేస్తూ సమస్యలను బీజేపీ పక్కదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
             అభివృద్ధి చెందుతున్న జాబితాలోని మన దేశం మోడీ సర్కారు విధానాలతో తిరోగమనం దిశగా ప్రయాణిస్తున్నదని చెప్పారు. దేశంలో గడిచిన 50 ఏండ్లలోనే అత్యంత గరిష్టానికి నిరుద్యోగ శాతం చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో నూతన పోస్టుల సృష్టి జరక్కపోగా ఖాళీల్లోని ఒక్క పోస్టునూ భర్తీ చేయట్లేదని వివరించారు. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలతో ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో వెనుకబడిన సామాజిక తరగతుల వాళ్లకు తీరని అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. దేశంలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్‌, యూపీ, కర్నాటక, తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బెంగాల్‌లో రాజకీయ లబ్ది కోసం మతం పేరిట నిత్యం ఉద్రిక్త పరిస్థితులను ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ శక్తులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. శివలింగాల పేరుతో మోహన్‌భగవత్‌, బీజేపీ నేతలు, ప్రజాప్రతి నిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ చేస్తున్న చేష్టలతో అంతర్జాతీయంగా మన దేశానికి చెడ్డ పేరు వస్తున్నదనీ, అరబ్‌ దేశాలన్నీ మన దౌత్యకార్యాల యాల వద్ద ఆందోళనలు చేస్తున్న పరిస్థితి నెలకొం దని వివరించారు. కర్నాటకలో జాతీయోద్యమ నాయకులు భగత్‌సింగ్‌ పాఠ్యాంశాలను తీసేసి స్వాతంత్య్రోమ కాలంలో బ్రిటీష్‌ పాలకులకు వత్తాసు పలికిన నేతల పాఠ్యాంశాలను జొప్పించడం దుర్మార్గ మన్నారు. స్కార్ప్‌ కట్టుకోవడం, కొంగుతో కప్పు కోవడం లాంటివి ఒక్క ముస్లిం మహిళలే చేయరనీ, ఉత్తరభారతంలోని మెజార్టీ మహిళలు ఆ పని చేస్తారని తెలిపారు. కర్నాటకలో బురఖా అంశాన్ని హిందూత్వ శక్తులు రాజకీయ లబ్ది కోసం వివాదాస్పదం చేశాయని విమర్శించారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లో ఐదో తరగతి విద్యార్థులకు ఆయన గురించి తెలియకపోవడం శోచనీయమన్నారు. దీనిని బట్టే పాఠ్యపుస్తకాలలో హిందూత్వ భావజాలాన్ని ఎలా జొప్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు. యూజీసీ, జేఎన్‌యూ కీలక భాగాల్లో హిందూత్వ శక్తులు, తమకు అనుకూలంగా ఉండే వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించుకున్నదని వివరించారు. యూపీలో యోగీ సర్కారు ప్రశ్నించేవారిపై దాడులు చేస్తూ బుల్డోజర్‌ పేరుతో రాజ్యాంగ, లౌకిక, సాంస్కృతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నదని విమర్శించారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడిన సమయంలో వచ్చే వందేండ్లలో అఖండ భారత్‌ పేరుతో దేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నదనీ, అందులో భాగమే ఈ చర్యలన్నీ అని తెలిపారు. 1964లో సీపీఐ(ఎం) ఏర్పడినప్పుడు అందులోని పొలిట్‌బ్యూరో సభ్యులంతా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపారనీ, వారు దేశం కోసం పోరాడిన నిజమైన దేశభక్తులు అని తెలిపారు. వారి స్ఫూర్తితో దేశంలో రాజ్యాంగ, లౌకిక విలువలను కాపాడుకునేందుకు దేశభక్తియుత పోరాటాల్లోకి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
             ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ..పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకపోవడం సరిగాదన్నారు. రాష్ట్రంలోని 24వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయకుండా చదువులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. పెంచిన బస్‌చార్జీలకు వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టి ప్రభుత్వం దిగొచ్చేదాకా పెద్దఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం చట్టం చేసేలా పోరాడుతామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువల కోసం రూ.3 వేల కోట్లు విడుదల చేయకపోవడం దారుణమని విమర్శించారు. గర్ల్స్‌ కో-కన్వీనర్‌ మిశ్రీన్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న లైంగిక దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. షీటీమ్‌లు షోటీమ్‌లుగా కాకుండా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడి ఘటనల్లో పొలిటిల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారి పట్ల ఒకలా, రాజకీయ పలుకుబడి లేనివారి పట్ల మరోలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్‌ఎల్‌ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గర్ల్స్‌ కన్వీనర్‌ పూజ, హెచ్‌సీయూ సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర ఉపాధ్యక్షులు జావేద్‌, రవి, శ్రీకాంత్‌వర్మ, రజనీకాంత్‌, సంతోష్‌, బషీర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శంకర్‌, వనం రాజు, ప్రశాంత్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్‌, అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.