Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రణరంగం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 15,2022

రణరంగం

- హుస్నాబాద్‌లో ఉద్రిక్తం
- మా రక్తంతో పంటలు పండిస్తారా?
- టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాపై కాఠిÄన్యమెందుకు?
- రెండో రోజూ గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన
- గులాబీ నాయకుల కవ్వింపు చర్యలు
- చక్కదిద్దే క్రమంలో పోలీసులకు గాయాలు
- సొమ్మసిల్లిన ముగ్గురు నిర్వాసిత మహిళలు
- ధ్వంసమైన వాహనాలు
నవతెలంగాణ-హుస్నాబాద్‌
             పోలీసుల దాడి, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కవ్వింపు చర్యలతో మంగళవారం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజల ఆర్తనాదాలతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మరోసారి రణరంగంగా మారింది. గౌరవెల్లి నిర్వాసితులు తమకు న్యాయంగా రావాల్సినవి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని అడుగుతుంటే పోలీసులు, అధికారపార్టీ నాయకులు వారిపై దాడికి దిగుతూ కవ్వింపుచర్యలకు పాల్పడ్డారు. ఆదివారం అర్థ్రరాత్రి వారి ఇండ్లపైకి పోలీసులు వెళ్లి దాడులు చేయడంతో దానికి నిరసనగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన నిర్వాసితులపైకి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి దిగారు. ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ మొదలుపెట్టాలని హుస్నాబాద్‌ ఆర్డీవోకు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆ పార్టీ నాయకులు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు నిర్వాసితుల ఆందోళనకు దారితీసింది. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వాలనే ప్రయత్నాన్ని వందలాది మంది నిర్వాసితులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల తీరును గర్హిస్తూ నిర్వాసితులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని హనుమకొండ రోడ్డుపై బైటాయించారు. తమ ద్ణుఖాన్ని ఆపి సంబురాలు చేసుకోండని విలపించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడికి తరలివచ్చిన నిర్వాసితులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
             'ఇప్పటికే నలభై మందిదాకా భూమి బెంగతో సచ్చిపోయిండ్రు. ఇగ మమ్ములను గూడా ప్రాజెక్టుల బొందవెట్టుండ్రి.మా రక్తాన్ని పంటలకు పారియ్యుం డ్రి'అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు విలపిం చారు. భూములు, ఇండ్లుపోయి గోసపడుతున్నా మని, తామేం దౌర్జన్యం చేస్తలేమని, చట్ట ప్రకారం తమకు రావాల్సిన పరిహారాన్ని అడుగుతున్నామని, తమకు సహకరించాలని నిర్వాసితులు ప్రాధేయపడ్డారు. ఒకరినొకరు తోపులాడుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. పరిస్థితి అదుపుతప్పడంతో తోపులాట జరిగింది. ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుమారు కిలోమీటరున్నర దూరాన ఉన్న ఆర్డీవో కార్యాయానికి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మళ్లీ తోపులాట జరిగింది. దాంతో హుస్నాబాద్‌ ఏసీపీ సతీశ్‌, ఎస్‌ఐ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. నిర్వాసితులు నల్ల అనసూయ, కలువల సుమలత, నోముల అనితకు గాయాలు కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. వారిని 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాంతో నిర్వాసితుల్లో మరింత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించేందుకు ఒక్కసారిగా కదిలివచ్చారు. అక్కడ పోలీసులతో మరోసారి తోపులాట జరిగింది. ఎలాగైనా ఆందోళనకారులను చెదరగొట్టాలని పోలీసు బలగాలు ఒక్కసారిగా నిర్వాసితులపైకి దూసుకు వచ్చి బలవంతంగా తోసేశారు. పోలీసుల చర్యతో వృద్ధులు, మహిళలు భయాందోళన చెందారు. తమను చంపుతారా అంటూ నిర్వాసితులు విలపించారు. కొద్దిసేపు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. అనంతరం మల్లెచెట్టు చౌరస్తాలో బైటాయించారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం: సిద్దిపేట సీపీ శ్వేత

             కలెక్టర్‌తో పాటు ప్రభుత్వంతో మాట్లాడి నిర్వాసితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తానని, ఆందోళన విరమించాని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. రెండు రోజులు ఓపికగా ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ వచ్చి తమకు హామీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేయడంతో మాట్లాడిస్తానని చెప్పారు. సీపీ హామీ ఇవ్వడంతో రాత్రి 8.30 గంటలకు నిర్వాసితులు తిరిగి వెళ్లారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.