Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కడుపులో తన్నారు.. లాఠీలతో చావబాదారు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 16,2022

కడుపులో తన్నారు.. లాఠీలతో చావబాదారు

- నిద్రమత్తు దిగలేదా? అంటూ పోలీసులు బూతులు తింటారు
- అర్ధరాత్రి కాలయముల్లా విరుచుకుపడ్డారు
- ఇల్లు, కనీసం గుడిసె వేసుకునేందుకు సర్కార్‌ జాగ చూపలే!
- సీఎం ఇలాకాలో సకల సదుపాయాలూ.. మాకేమో మన్నా?
- కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 'గౌరవెళ్లి' నిర్వాసితుల గోడు
- బాధితులకు వామపక్ష నేతల బాసట
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడ్డారు. నిద్రమత్తు దిగలేదా? అంటూ మొఖంపైనే పిడిగుద్దులు కురిపించారు. లాఠీలు, కర్రలతో చితకబాదారు. రోడ్డుమీదకు పరిగెత్తితే దొరికిన పైపులు, కర్రలతో చావబాదారు. సర్వం కోల్పోయిన మాపై కనీసం కనికరం లేని సర్కారు.. ఉండేందుకు ఇల్లు ఇవ్వకుండా, కనీసం గుడిసె వేసుకునేందుకు జాగా ఇవ్వకుండా అర్ధరాత్రి సుమారు 500 బంది ఖాకీలను కాలయముల్లా దింపి మమ్ములను చావబాదింది' అంటూ కరీంనగర్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులు 'నవతెలంగాణ'తో గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరిని కదిలించినా గుండెలవిసేలా రోదిస్తూ తమ నిస్సహాయతను వెలిబుచ్చారు. అందులో కొన్ని వారి మాటల్లోనే..
'ఇంట్లో ఉన్న నా కొడుకును పోలీసోళ్లు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. నా కడుపుల తన్నంగనే లేవచేతగాలేదు. ఏడ్చుకుంటూ మెల్లగా బయటకు వచ్చేసరికి వాడంతా రణరంగమైంది' అంటూ గుటాటిపల్లివాసి నోముల అనిత ఏడ్చిఏడ్చి బొంగురుపోయిన గొంతుతో బాధను చెప్పింది. ఆమె పక్కనే చికిత్స పొందుతున్న అదే గ్రామానికి చెందిన మరో బాధితురాలు నోముల స్వరూప మాట్లాడుతూ.. 'నా రెక్కలు విరిచి ఇంట్లోకెళ్లి బయటకు లాగారు. ఎంత ఏడ్చినా కనికరించకుండా లాఠీలతో కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక స్పృహతప్పిపోయా. నా కొడుకు, బిడ్డలు ఈ కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చిండ్రు' అంటూ వాపోయింది. ఇలా చికిత్స పొందుతున్న నిర్వాసితుల్లో ఎవరిని కదిలించినా ఒక్కొక్కరూ తమ గోడును చెప్పుకున్నారు.

రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపుతోనే సమస్య..
గౌరవెళ్లిని పెద్దచెరువును చిన్న రిజయర్వాయర్‌గా మార్చాలని 2009లో అప్పటి ప్రభుత్వం 1.8టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు డిజైన్‌ చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ సర్కారు ఆ రిజర్వాయర్‌ను రీడిజైన్‌ చేసి 8.3టీఎంసీల సామర్థ్యానికి పెంచింది. దీంతో ముంపు ప్రాంతం పెరిగి నిర్వాసితులూ పెరిగారు. ఏకంగా 3870 ఎకరాలు రైతుల నుంచే సేకరించాల్సి వచ్చింది. అయితే, తొలుత ప్రాజెక్టు డిజైన్‌ చేసిన సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అప్పటి సర్కారు ఎకరాకు రూ.2.10లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో ప్రాజెక్టు పైభాగంలో భూములు కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో ఆ భూములూ కోల్పోవాల్సి వచ్చింది. అయితే, గతంలో ఇచ్చిన పరిహారంతోనే భూములు దొరకని పరిస్థితి నెలకొనగా.. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఏకంగా ఎకరా రూ.30లక్షల వరకు పలుకుతుండటం, సర్కారు ఇచ్చే పరిహారం అందులో సగం కూడా లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తోంది. ఇదంతా ఒకెత్తయితే.. వారికి ఇంతవరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదు. కనీసం ఇండ్ల స్థలాలూ ఇవ్వలేదు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లూ చూపలేదు. రిజర్వాయర్‌లో ట్రయల్‌రన్‌ పేరుతో రాత్రికి రాత్రే సుమారు 400 మంది పోలీసుబలగాలు గుడాటిపల్లిని చుట్టుముట్టి వెళ్లగొట్టడమే రణరంగానికి దారి తీసింది.

ఒక్కొక్కరిదీ ఒక్కో గోడు...
8 గుటాటిపల్లికి చెందిన నోముల అనిత తన పది ఎకరాల్లో 8 ఎకరాలు గౌరవెల్లి ప్రాజెక్టు పనుల ప్రారంభంలోనే 2009లో కోల్పోయింది. తరువాత ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచగా ఉన్న మరో రెండెకరాల భూమీ పోయింది. మొదట్లో ఎకరాకు ఇచ్చిన రూ.2.10లక్షలతో కనీసం మరో ఎకరం భూమి రాలేదు సరికదా ఇప్పుడు చుట్టుపక్కల రూ.30లక్షలకుపైగా పలుకుతోందని బోరున విలపించారు. 8 ఇదే గ్రామానికి చెందిన నల్ల అనసూయ 10 ఎకరాల భూమి 12ఏండ్ల కిందట ప్రాజెక్టు కింద కోల్పోయింది. ఎకరాకు రూ.2.10లక్షల చొప్పున వచ్చిన పరిహారంతో ప్రాజెక్టు పైభాగంలోని గ్రామంలో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో మళ్లీ కొనుక్కున్న భూమినీ కోల్పోవాల్సి వచ్చింది. వ్యవసాయం తప్ప మరే పనీ తెలువని అనసూయ, ఆమె కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. 'ప్రభుత్వం మాకు కనీసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదు. బతికేందుకు ఉపాధీ చూపలేదు. ఉండేందుకు గూడు ఇవ్వలేదు. సర్కారోళ్లు మా బతుకుల్లో మన్నుపోసిండ్రు. మా బతుకులు ఆగం చేసిండ్రు' అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది.
8'కొండపోచమ్మ సాగర్‌ కింద భూములు కోల్పోయిన వారికి 2013యాక్ట్‌ ప్రకారం పరిహారం చెల్లించారు. పైగా 18ఏండ్లు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.8లక్షల చొప్పున ఇచ్చారు. కుటుంబానికి 200 గజాల స్థలాన్ని ఇచ్చారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లనూ కేటాయించారు. అది సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం కావడంతో సకల సదుపాయాలూ కల్పించారు. మాకేమో చేతిల మన్నుపోసి రోడ్డున పడేశారు' అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పుకొచ్చారు. బుధవారం ఆస్పత్రుల్లో వామపక్ష పార్టీల నేతలు పరామర్శించి, బాసటా ఉంటామని భరోసా ఇచ్చారు.

నిర్వాసితులకు అండగా ఎర్రజెండా
నిర్వాసితులపై టీఆర్‌ఎస్‌ గుండాలు, పోలీసులు దాడి చేయడం పనికిమాలిన చర్య. వారిని కఠినంగా శిక్షించాలి. ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వెలకట్ట లేనిది. ప్రాజెక్టులు దేవాలయాలు, నిర్వాసితులు దేవుళ్లు అంటూ కీర్తించే సీఎం కేసీఆర్‌ ఆ ఘటనపై నైతిక బాధ్యత వహించాలి. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించాలి.


- మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.