Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జక్కలొద్ది పోరాట స్ఫూర్తికి కేంద్రం ఇండ్లస్థలాలిచ్చేదాకా తగ్గేదేలేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 16,2022

జక్కలొద్ది పోరాట స్ఫూర్తికి కేంద్రం ఇండ్లస్థలాలిచ్చేదాకా తగ్గేదేలేదు

- అన్ని జిల్లాలకూ ఉద్యమాన్ని విస్తరిస్తాం
- సమగ్ర భూ సర్వే చేయాలి..మిగులు భూమి పేదలకు పంచాల్సిందే
- ఈ నెల 20 వరకు జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు
- 20 నుంచి 31వ తేదీ వరకు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతులు
- ఆ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణతో పోరాటం ముందుకు:
వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్‌ టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వరంగల్‌లోని జక్కలొద్ది పోరాట స్ఫూర్తి కేంద్రమనీ, అక్కడ పేదలకు సర్కారు ఇండ్ల స్థలాలిచ్చే వరకూ పోరాటం నుంచి వెనక్కి తగ్గేదే లేదని పలువురు వక్తలు స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే చేసి మిగులు భూములను పేదలకు పంచాల్సిందేనని నొక్కి చెప్పారు. లేకుంటే భూమి, ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. 'ప్రభుత్వ నిర్బంధం ఆపాలి..గుడిసెవాసులకు ఇండ్ల జాగాలివ్వాలి' అని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇండ్ల స్థలాల పోరాట వాసులకు సంఘీభావంగా బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్‌కే) రాష్ట్ర కన్వీనర్‌ జి. రాములు మాట్లాడుతూ..వరంగల్‌ నగరంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రజాప్రతినిధులు, రియల్టర్ల ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు. వాటిని రక్షించకుండా కనీసం గూడు లేకుండా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలపై పోలీసులతో, గుండాలతో దాడులు చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకుని ఇండ్ల స్థలాల కోసం కలిసికట్టుగా పోరాడాలని ప్రజల కు పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాల కోసం పేదలు చేస్తున్న పోరాటం లో తమ సంఘం ప్రత్యక్షంగా పాల్గొంటుందని హామీనిచ్చారు. టీఎస్‌ఐపాస్‌ పేరుతో వందల ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర సర్కారుకు పేదలకు ఇండ్లస్థలాలిచ్చేందుకు భూములు దొరకడం లేదా? అని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జి.జగదీశ్‌ మాట్లాడుతూ..జక్కలొద్దిలోని 298 ఎకరాల ప్రభుత్వ భూమిలో రియల్టర్లు, భూబకాసురుల ఆక్రమణలతో మిగిలింది కేవలం 50 ఎకరాలు మాత్రమేననీ, ఆ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్న పరిస్థితి ఉందని విమర్శి ంచారు. పోలీసులు అర్ధరాత్రి పూట బుల్డోజర్లు తీసుకొచ్చి 7300 గుడిసెలను కూల్చేసి తగుల బెట్టడం అన్యామన్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రాష్ట్ర సర్కారు పట్టించుకోక పోవడంతో పేదలు అక్కడ గుడిసెలు వేసుకున్నా రని గుర్తుచేశారు. బీకేఎమ్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కె.కాంతయ్య మాట్లాడుతూ..కమ్యూనిస్టులకు భూ పోరాటాలు కొత్తేమి కాదని చెబుతూ రైతాంగ సాయుధ పోరాటం, ముదిగొండ తదితర పోరాటాలను వివరించారు. మూడెకరా లిస్తామనీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టిస్తామని ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్‌ మోసం చేశారని విమర్శిం చారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌ మాట్లాడుతూ..పోడు భూముల సమస్యను త్వరితంగా పరిష్కరించా లనీ, పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇండ్ల స్థలాలు, భూమి కోసం జరుగుతున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటు ందని ప్రకటించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌నాయక్‌ మాట్లాడుతూ..కేసీఆర్‌ ప్రభుత్వం మీద పేదలకు నమ్మకంపోయిందనీ, అందుకే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల కోసం పోరాడు తున్నారని చెప్పారు. నిర్బంధాలు విధించే కొద్దీ ప్రభుత్వానికే నష్టమనే విషయాన్ని కేసీఆర్‌ గుర్తించి పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల కన్వీనింగ్‌ కమిటీ కన్వీనర్‌ బి.పద్మ, డీబీఎఫ్‌ రాష్ట్ర నాయకులు కల్పన, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్‌.ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

పలు తీర్మానాలకు రౌండ్‌ టేబుల్‌ ఆమోదం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సమగ్రభూ సర్వే చేయించి మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు లేని కుటుంబా లు లక్షల్లో ఉన్నాయనీ, ఆ కుటుంబా లకు వెంటనే ఇండ్ల స్థలాలివ్వాలని కోరారు. పోడు రైతులందరికీ హక్కుపత్రాలివ్వాలన్నారు. ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న గుడిసె వాసులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహ రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి 20 నుంచి 31వ తేదీ వరకు ఎమ్మార్వోలు, ఆర్డీఓలు, కలెక్టర్లకు ఇండ్ల స్థలాల కోసం వినతిపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి జూలై నెలలో పోరాటాన్ని ఉధృతం చేస్తామనీ, ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని తెలిపారు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.