Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీకోసం అన్నదాత బలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 16,2022

అదానీకోసం అన్నదాత బలి

- పంట భూముల్లో హై టెన్షన్‌ కరెంట్‌ పోల్స్‌... నిర్బంధంలో మొగిలిచర్ల
- నోటీసులు ఇవ్వకుండానే పనులు
- ఆందోళనకు దిగిన రైతుల అరెస్ట్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/కాశిబుగ్గ
గ్రేటర్‌ వరంగల్‌లోని మొగిలిచర్లలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజాము నుంచే పోలీసులు మొగిలిచర్ల గ్రామాన్ని దిగ్బంధించారు. అసలు ఏం జరుగుతుందో తెలియని ప్రజలు మొదట ఆందోళనకు గురయ్యారు. చివరకు తమపంట పొలాల్లో హై టెన్షన్‌ కరెంటు పోల్స్‌ వేస్తున్నారని తెలుసుకుని ఆందోళనకు దిగారు. ఒకపక్క రైతులు ఆందోళన చేస్తుండగానే మరో పక్క గుత్తేదారులు పనులు ప్రారంభించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమ భూముల్లో ఎలా పనులు చేస్తారని ప్రశ్నించారు. గుజరాత్‌లోని వడోదర నుంచి హైదరాబాద్‌ వరకు 888 కిలోమీటర్ల మేరకు 420 కెేవీ లైన్‌ను అమర్చే పనులు అదానీ కంపెనీ చేపట్టింది. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో నష్టపరిహారం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిన నేపథ్యంలో ఈ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం ఉదయం 6.00 గంటలకు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దింపి మొగిలిచర్ల గ్రామాన్ని దిగ్బంధించారు. గ్రామంలోకి వచ్చే వారిని, వెళ్లే వారిని తనిఖీలు చేస్తూ పనులను అడ్డుకుంటున్న రైతులను అరెస్ట్‌ చేస్తామని భయాందోళనకు గురిచేశారు. కాగా, ఆందోళన చేస్తున్న 200 మంది రైతులతో పాటు సంఘీభావం తెలపడానికి వచ్చిన వరంగల్‌, హన్మకొండ డీసీసీి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణను పోలీసులు అరెస్ట్‌ చేసి గీసుగొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తిమ్మంపేటలో గ్రిడ్‌ స్టేషన్‌ నిర్మాణం
జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తిమ్మంపేట గ్రామంలో 720 కేవీ గ్రిడ్‌ పవర్‌ స్టేషన్‌ను 105 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. మొగిలిచర్ల నుంచి వచ్చే 420 కేవీ లైన్‌ తిమ్మంపేట పవర్‌ గ్రిడ్‌ స్టేషన్‌కు విద్యుత్తును అందించనుంది. 2017లోనే తిమ్మంపేటలో పవర్‌ గ్రిడ్‌ స్టేషన్‌ పనులు ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. మొగిలిచర్ల నుంచి ఒక లైన్‌ను దామెర మండలం ఒగ్లాపూర్‌లోని పవర్‌ గ్రిడ్‌ స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. వడోదర నుంచి వచ్చే 420 కేవీ లైన్‌ తిమ్మంపేట మీదుగా హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే తిమ్మంపేట నుంచి హైదరాబాద్‌-నాగర్‌కర్నూల్‌ వరకు ఎరెక్షన్‌ అయినట్టు సమాచారం. వైరింగ్‌ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొగిలిచర్ల గ్రామంలో రైతులు ప్రతిఘటించడంతో కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఎదురుతిరిగిన రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించి మరీ టవర్ల నిర్మాణం చేస్తున్నారు.

ధర్మారెడ్డి మోసం చేసిండు
అదానీ కంపెనీ చేస్తున్న పవర్‌ గ్రిడ్‌ పనుల్లో భాగంగా హైటెన్షన్‌ వైర్ల లైన్స్‌ వేయడానికి ల్యాండ్‌ పూలింగ్‌ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎమ్మెల్యే ధర్మారెడ్డి అధ్వర్యంలో జరుగుతున్నదని, అతను నాశనమైపోతడని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. తమకున్న ఎకరం, రెండెకరాల్లో టవర్ల నిర్మాణంతో 10 గుంటల భూమి పోతే మాకు మిగిలిదెంతంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సర్కార్‌ మమ్మల్ని బలిపశువులను చేస్తుందని వాపోయారు. ఇప్పటి వరకు ఏ అధికారి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదన్నారు. ఇక్కడ ఎకరం కోటి రూపాయలుందని, మా భూముల్లో టవర్లు వేస్తూ పోలీసులు మాపై దౌర్జన్యం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టవర్ల నిర్మాణంతో మా భూములు బీడ్లుగా మారతాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఆర్‌డీవో దృష్టికి తీసుకుపోయినా మాకు న్యాయం జరుగలేదన్నారు.
కాంగ్రెస్‌ అండగా ఉంటుంది : డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌ రెడ్డి
గుత్తేదారులు కలెక్టర్‌ వద్ద పర్మిషన్‌ తీసుకుని పోలీసుల పహారాలో పనులు చేసుకోవడం దుర్మార్గమైన చర్య. రైతులను సమావేశపరిచి వారితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి. అంతవరకు పనులు నిలుపుదల చేయాలి. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది.
భూముల విలువ తగ్గుతుంది : తిరుపతి, మొగిలిచర్ల రైతు
తమ భూమిలో నుంచి హై టెన్షన్‌ లైన్‌ పోవడం వల్ల భూముల విలువలు తగ్గుతాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల భూములను వారి ఇష్టపూర్వకంగానే తీసుకోవాలి కానీ నేడు జీవోకు విరుద్ధంగా దౌర్జన్యంగా సమాచారం ఇవ్వకుండానే భూముల్లో పనులు చేయడం దారుణం.
ధర్మారెడ్డికి రైతుల ఉసురు తగులుతుంది : కొండేటి రాజు, గొర్రెకుంట
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రైతుల ఉసురు తగులుతుంది. ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న చల్లా ధర్మారెడ్డి మరోసారి రైతుల భూముల నుంచి హై టెన్షన్‌ లైన్లు వేయించడం దుర్మార్గం. ఇప్పటికే గొర్రెకుంట రెడ్డిపాలెం ప్రాంతంలో అనుమ తులు లేకుండా డాంబర్‌ ప్లాంట్‌ పెట్టి పంటపొలాలను నాశనం చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.