Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంతమందిలో హెపటైటీస్‌? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 17,2022

ఎంతమందిలో హెపటైటీస్‌?

ఎయిడ్స్‌ నియంత్రణ స్క్రీనింగ్‌ క్యాంప్‌తో తేలిందేంటి?
- నిధులు ఖర్చు చేసినా ఫలితమేది?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           పథకాలు ఒక లక్ష్యం కోసముంటాయి. వాటిని సరిగ్గా అమలు చేస్తే ఆ లక్ష్యం నెరవేరి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అలా కాదని నిధులు ఖర్చు చేసి నామమాత్రంగా అయిందనిపిస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ రెండు నెలల పాటు నిర్వహించిన శిబిరాలకు సంబంధించి అధికార వర్గాల్లో అలాంటి చర్చే జరుగుతున్నది. ఎయిడ్స్‌ రోగుల్లో వైరల్‌ హెపటైటీస్‌ను గుర్తించేందుకు ఉద్దేశించిన స్క్రీనింగ్‌ క్యాంప్‌తో వచ్చిన ఫలితమేముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వైరల్‌ హెపటైటీస్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ ఉద్ధేశం నీరు గారిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (టిశాక్స్‌) చేపట్టిన ఈ స్క్రీనింగ్‌ ఎంత మందిలో హెపటైటీస్‌ను నిర్దారించారనే దానిపై లెక్కలు స్పష్టంగా లేవని విశ్వసనీయ సమాచారం. నిర్దారించిన వారిని సైతం గాలికి వదిలేశారని భావిస్తున్నారు. కేవలం నిధుల కోసమే అన్నట్టు నిర్వహించి ఇంత నిర్లక్ష్యంగా ఉండటానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణ లోపమే కారణమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ''వైరల్‌ హెపటైటీస్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ ను హైరిస్క్‌ ప్రాంతాల్లో, ఎయిడ్స్‌ సోకిన వారికి నిర్వహించాలని ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి రాష్ట్ర వైద్యశాఖకు ప్రతిపాదించగా, అందుకు ఆ శాఖ అనుమతినిచ్చింది. హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌తో పాటు మరో ఒకటి రెండు జిల్లాలో రెండు నెలల పాటు 'స్క్రీనింగ్‌ క్యాంప్‌' నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్‌ నిమిత్తం రూ.40 నుంచి రూ.50 లక్షల నిధులను కూడా విడుదల చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 'స్క్రీనింగ్‌ క్యాంప్‌' నిర్వహించేందుకు తాత్కాలిక పద్ధతిన డాటా మేనేజర్‌, ల్యాబ్‌టెక్నీషియన్‌ సిబ్బందిని నియమించారు. హైరిస్క్‌ ప్రాంతాలతో పాటు, ఎయిడ్స్‌ సోకిన మొత్తం ఎనిమిది వేల మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇందులో సుమారు 150 నుంచి 200 వరకు హెపటైటీస్‌ కేసులు ఉన్నట్టు గుర్తించారు. పాజిటివ్‌ సోకిన వారిలో వైరల్‌ కౌంట్‌ గుర్తించేందుకు తక్షణమే ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా చికిత్సను ప్రారంభించాలి. ఈ చికిత్సకు సంబంధించి కొన్ని మందులను కూడా పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచారు. కానీ, ఆ సొసైటీలోని సదరు ఉన్నతాధికారి మాత్రం కేవలం స్క్రీనింగ్‌ క్యాంప్‌కే పరిమితం అయినట్టు తెలిసింది. పాజిటివ్‌ గుర్తించిన వారి నివేదికను కూడా వైద్య ఆరోగ్యశాఖకు పంపించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారిలో వ్యాధి స్థాయిని గుర్తించి చికిత్స చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ ప్రక్రియను చేపట్టలేదు. దీంతో పాజిటివ్‌ సోకిన వారి పరిస్థితి ఏమిటనీ, వారిలో వ్యాధి తీవ్రత పెరిగితే ప్రమాదకరమని ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థలోని కొందరు వాపోతున్నారు. లక్షలు ఖర్చు చేసి చేపట్టిన ఈ శిబిరంలో ఎంత మంది పాజిటివ్‌ ఉన్నారనే అంశాన్ని వైద్యారోగ్య శాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కేవలం నిధుల కోసమే ''వైరల్‌ హెపటైటీస్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహించినట్టు విమర్శలున్నాయి. డాటా మేనేజర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు సక్రమంగా వేతనాలు కూడా ఇవ్వలేదనీ, వారికి సెలవుల వేతనాలను కూడా కట్‌ చేశారనీ, ప్రాజెక్ట్‌ నుంచి మాత్రం పూర్తి స్థాయి వేతనాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.