Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గౌరవెల్లిలో రైతన్న గోస... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 18,2022

గౌరవెల్లిలో రైతన్న గోస...

కలల ప్రాజెక్టులో కడతేరని విషాదం
- సర్కార్‌ కర్కశంతో నిర్వాసితుల ఆర్తనాదాలు
- అందని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ
- పోలీసులు, అధికారపార్టీ దాడులు
నవతెలంగాణ-హుస్నాబాద్‌
          గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ.. రైతుల్లో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తూ.. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం ఆగుతూ సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కొత్తగా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. గౌరవెల్లి ప్రాజెక్టుకు 2007లో శంకుస్థాపన జరిగింది. అప్పుడు 1.4 టీఎంసీల సామర్ధ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మించతలపెట్టారు. ముంపు ప్రాంతం ఎక్కువగా ఉండకుండా, మెట్టప్రాంతాలన్నిం టికీ నీళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందించారు. అప్పుడు ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపులో ఉంది. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. గుడాటిపల్లితో పాటు తెనుగుపల్లి, మద్దెలపల్లి, సోమాజీతండా, సేవానాయక్‌ తండా, బొంద్యానాయక్‌ తండా, జాలుబారు తండా, చింతల్‌ తండా, తిరుమల్‌ తండా, కొత్తపల్లి మునిగిపోయాయి. దాదాపు 3 వేల ఎకరాల భూమి మునిగిపోగా, 3 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
పరిహారం ఇవ్వకుండానే పనులు..
          గతేడాది ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగడంతో డిసెంబరు నుంచి నిర్వాసితులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇటీవల గౌరవెల్లి జలాశయం కట్టపై ఉన్న దారులను మూసివేసే ప్రయత్నం చేయడం, పంపుహౌస్‌లో మోటార్లను బిగిస్తున్నా మని చెప్పడం, ఈ నెల 12వ తేదీన ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించడంతో నిర్వాసితులు ఆందోళనలను ఉధృతం చేశారు. పాత డిజైన్‌ 1.4 టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించి 2016లో పునరావాస ప్యాకేజీ గెజిట్‌ లిస్టులో 110 మంది పేర్లు తప్పిపోయాయని, వారికి ప్యాకేజీ ఇవ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. ఇంకా 23 ఇండ్లకు, 2 పశువుల కొట్టాలకు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా, 2010లో సేకరించిన ఇండ్ల అడుగు స్థలాల డబ్బులు, ఇప్పటివరకు 18 ఏండ్లు నిండిన సుమారు 550 మంది యువతీయువకులకు పునరావాస పునరుపాధి ఇవ్వలేదంటున్నారు. నిర్వాసితులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా, ఇంకా కొంత భూమికి పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొత్త డిజైన్‌ 8.4 టీఎంసీ సామర్థ్యానికి సంబంధించిన 85 ఎకరాల భూమికి పరిహారం ఇవ్వలేదని, 106 ఇండ్లలో ఉన్న గిరిజనులకు పునరావాస పునరుపాధి ఇవ్వలేదంటున్నారు. తొలుత ప్రాజెక్టు డిజైన్‌ చేసిన సమయంలో భూములు కోల్పోయిన వారికి అప్పటి సర్కారు ఎకరాకు రూ.2.10లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో ప్రాజెక్టు పైభాగంలో భూములు కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచడంతో ఆ భూములూ కోల్పోవాల్సి వచ్చింది. అయితే, గతంలో ఇచ్చిన పరిహారంతోనే భూములు దొరకని పరిస్థితి నెలకొనగా, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా ఎకరా రూ.30లక్షల వరకు పలుకుతుండటం, సర్కారు ఇచ్చే పరిహారం అందులో సగం కూడా లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తోంది. ఇంతవరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదు. కనీసం ఇండ్ల స్థలాలూ ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లూ చూపలేదు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పనులు చేపట్టవద్దని హైకోర్టు కూడా స్టే విధించింది. దాంతో నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా అందించేందుకు అధికారులు సిద్ధం కాగా, తమకు పరిహారం ఇచ్చేదాకా పనులు చేయవద్దని నిర్వాసితులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం వేకువజామున సుమారు 500 మంది పోలీసులు గుడాటిపల్లిని చుట్టుముట్టి, ఇండ్లలో చొచ్చి నిద్రపోతున్న వారిని ఈడ్చుకొచ్చి కొట్టారు. ఆడామగా తేడా లేకుండా విచక్షణారహితంగా కొడుతూ వాహనాల్లో తోసిపడేశారు. దాంతో గుడాటిపల్లితోపాటు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల నుంచి నిర్వాసితులు తరలివచ్చి హుస్నాబాద్‌లో ఆందోళనలు చేపట్టారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కవ్వింపు చర్యలతో చెలరేగిన గొడవ పోలీసుల లాఠీచార్జికి దారితీసింది. ముగ్గురు నిర్వాసిత మహిళలకు తీవ్ర గాయాలు కాగా వారు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది యువకులను పోలీసులు కర్రలు, ఇనుప పైపులతో కొట్టారు.
కొనుక్కున్న భూమీ పోయింది..:నల్ల అనసూయ, గుడాటిపల్లి
          కాంగ్రెస్‌ సర్కారోళ్లు మొదట కట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు కింద మా పదెకరాల భూమి మునిగి పోయింది. అప్పుడు ఎకరానికి రూ.2.10లక్షల చొప్పున పరిహారాన్ని ఇచ్చారు. ఆ డబ్బులతో అప్పుడు ప్రాజెక్టు పైభాగంలోని గ్రామంలో 5 ఎకరాలు కొనుక్కున్నం. కేసీఆర్‌ వచ్చినక ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో మేం కొనుక్కున్న భూమి కూడా మునిగిపోయింది. ఇప్పుడు పరిహారమడిగితే పోలీసోళ్లు చావబాదిండ్రు.
మా ప్రాణం తీయాల్ననే భూములిచ్చినమా..:నోముల అనిత, గుడాటిపల్లి
          గౌరవెల్లి ప్రాజెక్టు మొదటి డిజైన్‌లో మా భూమి ఎనిమిదెకరాలు పోయింది. కేసీఆర్‌ వచ్చినక ప్రాజెక్టును పెంచడంతో మళ్లీ రెండెకరాలు మునిగిపోయింది. మొదట్లో ఎకరానికి రూ. 2.10లక్షలు పరిహారం ఇవ్వగా, వాటితో ఎకరం భూమి కూడా రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఎకరానికి రూ.30లక్షల నుంచి రూ.50లక్షలకు పైగా ధర ఉంది. మాకు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం ఇవ్వాలని అడిగితే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పోలీసోళ్లతో కొట్టిస్తంది.
మమ్మల్ని ఆగంజేసిండ్రు: బద్ధం రాజిరెడ్డి, సర్పంచి, గుడాటిపల్లి
          కొండపోచమ్మ సాగర్‌ కింద భూములు కోల్పోయిన వారికి 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించారు. 18ఏండ్లు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.8లక్షల చొప్పున ఇచ్చారు. కుటుంబానికి 200 గజాల స్థలాన్ని ఇచ్చారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లనూ కేటాయించారు. అది సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం కావడంతో సకల సదుపాయాలూ కల్పించారు. మాకేమో చేతిల మన్నుపోసి రోడ్డున పడేశారు. మా బతుకులను ఆగంజేశారు.

నిర్వాసితులకు అండగా ఉంటాం
          నిర్వాసితులపై టీఆర్‌ఎస్‌ గుండాలు, పోలీసులు దాడి చేయడం దుర్మార్గపు చర్య. వారిని కఠినంగా శిక్షించాలి. ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వెలకట్ట లేనిది. ప్రాజెక్టులు దేవాలయాలు, నిర్వాసితులు దేవుళ్లు అంటూ కీర్తించే సీఎం కేసీఆర్‌ ఆ ఘటనపై నైతిక బాధ్యత వహించాలి. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించాలి. నిర్వాసితులకు రావాల్సిన పరిహారాన్ని ఇచ్చాకే ప్రాజెక్టు పనులు చేయాలి. అప్పటిదాకా నిర్వాసితులకు అండగా ఉంటూ పోరాడతాం.
-మల్లారెడ్డి, సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి

నిర్వాసితులందరికీ పరిహారం అందుతోంది
          ఇప్పటి వరకు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 97.82 శాతం మందికి పరిహారం అందింది. ఇంకా 2.18 శాతం మందికి మాత్రమే మిగిలి ఉంది. 2011లో ప్రాజెక్టు పాత డిజైన్‌ 1.4 టీఎంసీ కింద 1814.33 ఎకరాల భూమి సేకరణ కోసం రూ.38.11 కోట్లు చెల్లించాం. కొత్త డిజైన్‌ 8.23 టీఎంసీ కింద 2055.17 ఎకరాల భూమి సేకరణ అవసరం కాగా, ఇందులో 1971.10 ఎకరాల భూమికి రూ.159.96 కోట్లు చెల్లించాం. 2017 నుంచి ఎకరాకు రూ. 6.95 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు భూసేకరణ జరిగింది. మిగిలిన 84.07 ఎకరాల భూమికి ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరైనా, ఆ భూములకు సంబంధించిన రైతులు పరిహారం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.15 లక్షల పరిహారాన్ని ఇస్తామన్నా రైతులు ముందుకు రావడంలేదు. ప్రాజెక్టు కింద 693 ఇండ్లు ముంపునకు గురి అవుతుండగా, 683 ఇండ్లుకు రూ.83 కోట్లు చెల్లించాం. మిగిలిన 10 ఇండ్లలో 5 ఇండ్లు కుటుంబ తగాదాలు, 5 ఇండ్లకు రీ సర్వే చేయాలని నిర్వాసితులు కోరడంతో పరిహారాన్ని ఇవ్వలేదు. ఇక, 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ రూ.8 లక్షలు ఇస్తున్నాం.
- వొడితల సతీశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, హుస్నాబాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.