Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'అగ్నిపథ్‌' దేశ భద్రతకే ముప్పు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 18,2022

'అగ్నిపథ్‌' దేశ భద్రతకే ముప్పు

- కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం వద్దేవద్దు
- యువకులకు ఇది అగ్నిపరీక్ష
- ఆ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలి
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్‌
- హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేండ్లపాటు సైనికుల నియామకం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ పథకం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శి ంచారు. ఈ కొత్త దాన్ని రద్దు చేయాలని మోడీ సర్కార్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. పాతపద్ధతిలోనే సైనికుల నియామకాలను చేపట్టాలని కోరారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు. సుందరయ్య పార్క్‌ చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. 'అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి, కాం ట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం సిగ్గుచేటు, నిరసన తెలిపే సైనిక అభ్యర్థులపై పోలీసుల కాల్పులను ఖండిం చండి, శాశ్వత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేండ్లపాటు సైనికుల నియామకాల కోసం కేంద్రం కొత్తగా అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు 17 ఏండ్ల కాలానికి సైనికుల నియామకాలు జరిగేవని గుర్తు చేశారు. అగ్నిపథ్‌ పథకం దేశంలోని యువకులకు అగ్నిపరీక్షలాగా మారిందన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన యువలకులకు ఈ పథకం వల్ల ఆశాభంగం కలిగించిందని అన్నారు. దేశ సేవ కోసం, భద్రత కోసం ప్రాణమైనా ఇచ్చేందుకు, త్యాగం చేసేందుకు సిద్ధపడిన వారి జీవితాలకే భద్రత లేకుండా కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నదని విమర్శించారు. నాలుగేండ్ల తర్వాత తొలగిస్తే దేశ భద్రత పటిష్టంగా ఉంటుందన్న బీజేపీ నాయకులు మాటలు సిగ్గులేనివని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్‌ స్ట్రైక్‌, కార్గిల్‌ వంటి యుద్ధాలు చేశామంటూ బీజేపీ నాయకులు గొప్పగా చెప్తున్నారని అన్నారు. 17 ఏండ్లపాటు ఉన్న సైనికులే ఆ యుద్ధాలు చేసి దేశ భద్రతను కాపాడారని గుర్తు చేశారు. వారు లోపాలు చేసినట్టు మాట్లాడ్డం సరైంది కాదన్నారు. నాలుగేండ్ల వరకే నియామకాలు చేపడితే గొప్పగా పోరాడాతారంటూ కేంద్రం వైఖరి ఉండడం దుర్మార్గమని విమర్శించారు. ఎంత తాత్కాలికంగా, ఎంత అభద్రతలో ఉంటే అంతబాగా దేశ రక్షణ కోసం కృషి చేస్తారంటూ వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ భద్రతతో బీజేపీ ఆటలాడుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం నిర్ణయంపై యువకులు ఆగ్రహా వేశాలతో ఆందోళన చేస్తున్నారని చెప్పారు. వారు దుర్మా ర్గులు, దేశద్రోహులు, ఉగ్రవాదులైనట్టు, ఆస్తులు ధ్వంసం చేసినట్టు కేంద్రం దురుసుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశం కోసం ప్రాణలిచ్చేందుకు సిద్ధపడ్డ వారిని దేశభక్తులుగా చూడాలని కోరారు. మోడీ సర్కారు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలని సూచించారు. రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మాట్లాడ్డం సరైంది కాదని చెప్పారు. అది అప్పటికపడు వచ్చిన ఆందోళన అని అన్నారు. రైతుల ఆందోళన విషయంలోనూ తొలుత దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత చట్టాలను ఉపసంహరించుకున్నారనీ, ఇప్పుడు అగ్నిపథ్‌నూ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మేధావులు, నిపుణులు, రిటైర్డ్‌ ఆర్మీ అధికారులతో సంప్రదించి కేంద్రం వాస్తవాలు గ్రహించాలని సూచించారు. అందరి అంగీకారంతో నిర్ణయా లు చేస్తేనే దేశానికి రక్షణ ఉంటుందన్నారు. ఏక పక్షంగా కేంద్రం ముందుకెళ్తే దేశ భద్రతకే ముప్పు వాటి ల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు తాము దేశభక్తులం అంటూ గొప్పపలకు పోతారనీ, ఇప్పుడేమో దేశానికే హాని చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాలుగేండ్లపాటు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేపడితే జీతాలు, పింఛన్‌, గ్రాట్యూటీ మిగులుతుందంటూ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తున్నదని చెప్పారు. అంబానీ, అదానీ సహా కార్పొరేట్‌ శక్తులకు రక్షణ రంగాన్ని కట్టబెట్టేం దుకు కేంద్రం లక్షల కోట్ల పన్ను రాయితీలను ప్రకటిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టిన వారికీ రాయితీలు ప్రకటిస్తున్నదని అన్నారు. కానీ సైనికుల సంక్షేమానికి నిధులు వెచ్చించేందుకు, వారికి జీతాలిచ్చేందుకు కేంద్రానికి మనసు రావడం లేదని విమర్శించారు. సైనిక సంక్షేమానికి కోత పెట్టి కార్పొరేట్‌ శక్తులకు రాయితీలివ్వడం సరైంది కాదన్నారు. ఇది దేశద్రోహం తప్ప మరొకటి కాదని చెప్పారు. బీజేపీ సర్కారు దీనిపై పునరాలోచించాలని కోరారు.
అభ్యర్థులను అణచివేయడం సరికాదు
             సికింద్రాబాద్‌లో ఆందోళనాకారులపై పోలీసులు కాల్పు లు జరిపారనీ, ఒకరు చనిపోయారనీ, చాలా మంది గాయ పడ్డారని రాఘవులు చెప్పారు. ఈ ఆగ్రహావేశాలను అర్థం చేసుకోకుండా పై అధికారుల ఆదేశాల ప్రకారమే కాల్పులు జరిపామంటూ పోలీసులు ప్రకటించడం సరైంది కాదన్నా రు. శత్రువుల ప్రాణాలు తీసేందుకు, దేశం కోసం ప్రాణాలి చ్చేందుకు సిద్ధమైన వారిని అణచివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని అన్నారు. వారిపై కేసులు నమోదు చేయొద్దని కోరారు. చనిపోయిన వారి కుటుంబానికి నష్టపరిహారం, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఒకవేళ కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి రక్షణ కల్పించాలనీ, వైద్యం అందించాలని కోరారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకం వల్ల దేశంలోని యువకులు ఇబ్బందులు పడి ఆవేశానికి లోనవుతున్నారని చెప్పారు. కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకాలు చేప ట్టడం దుర్మార్గమని విమర్శించారు. బడ్జెట్‌ను సైనికుల సంక్షే మానికి తగ్గించి ఆ యుధాల కొనుగోలుకు ఆ నిధులను విని యోగించే కుట్ర కేంద్రం చేస్తున్నదని అన్నారు. సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, డిజి నరసింహా రావు, టి జ్యోతి, ఎండీ అబ్బాస్‌తోపాటు పార్టీ, ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.