Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈఎస్‌ఐలో కష్టాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 19,2022

ఈఎస్‌ఐలో కష్టాలు

- సనత్‌నగర్‌లో పరీక్షల కోసం టోకెన్లు.....
- అవీ పరిమితంగానే పంపిణీ
- ఫాస్టింగ్‌ టెస్టులకు ఉదయం 10 దాటే వరకు ఆగాల్సిందే
- మందుల కోసం డిస్పెన్సరీ, సూపర్‌ స్పెషాలిటీ మధ్య పరుగులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
          అది హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి. రాష్ట్రంలోని పలు డిస్పెన్సరీల నుంచి రోగులు స్థానిక డాక్టర్ల సిఫారసులపై అక్కడకు వస్తుంటారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆ ఆస్పత్రిలో పలువురు ప్రముఖ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. నిత్యం వేలాది మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్నారు. ఇందులోనూ ఓపీ విభాగంలో చూయించుకునేందుకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉంటున్నది. అయితే వచ్చే రోగుల్లో చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారూ ఉంటున్నారు. వీరికి తోడు వికలాంగులు కూడా వస్తుంటారు. అయితే ఓపీ విభాగంలో చూపించుకునేందుకు ఓపీడీ స్లిప్‌ రాయించుకున్న రోగులు తాము సంప్రదించాలనుకున్న డాక్టర్‌ దగ్గరకు వెళ్లే ముందు రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటారు. ఇక అక్కడ్నుంచి వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి.
కూర్చునేందుకు వీల్లేదు...
          ఉదయాన్నే రోగులు వచ్చినప్పటికీ డాక్టర్లు వచ్చేంత వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వేచి చూసే రోగుల కోసం సాధారణంగా కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రుల్లో కూర్చునే సౌకర్యం ఉంటుంది. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మాత్రం అలాంటి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో రోగులు గంటల తరబడి లైన్లలో నిలుచోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వద్ధులు, పిల్లలు, వికలాంగుల పరిస్థితి దారణంగా ఉంటున్నది. ఇక గర్భిణులు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పనలవి కావంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూర్చునేందుకు తగిన సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
టెస్టు టోకెన్‌ కోసం ఉదయం నాలుగు గంటలకే.....
          అక్కడ రక్త పరీక్షలు చేయించుకోవాలంటే రన్నింగ్‌ రేస్‌ వచ్చి ఉండాలన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రతి రోజూ పరిమిత సంఖ్యలోనే టెస్టులు చేయాలనీ, అందులోనూ ముందుగానే టోకెన్‌ తీసుకున్న వారికి మాత్రమే చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ టెస్టుల టోకెన్ల కోసం ఉదయం నాలుగు గంటల నుంచి వచ్చి లైన్‌లో నిలుచుంటున్నారు. అప్పటికీ క్యూ కట్టిన వారందరికీ టోకెన్లు ఇస్తారా? అంటే అదీ లేదు. కొంత మందికి ఇచ్చి మిగిలిన వారిని మరుసటి రోజు రమ్మని పంపిస్తున్నారని రోగులు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ సెక్యూరిటీ సిబ్బందికి, రోగులకు మధ్య వాగ్వాదం జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇలా రెండు, మూడు రోజులు తిరిగినా కొంత మంది టోకెన్‌ దొరకకపోవడంతో అనివార్యంగా ప్రయివేటులో టెస్టులు చేయించుకుంటున్నారు. దీనికి తోడు ఏమి తినకుండానే చేయించుకోవాల్సిన పరీక్షల నమూనాలను కూడా మిగిలిన వారితో కలిపి సేకరిస్తుండటంతో వారి వంతు వచ్చే వరకు ఉపవాసముండాల్సిందే. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉదయం ఆరు గంటల నుంచే ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ తదితర పరీక్షలకు నమూనాలు సేకరించే సౌకర్యముంటుంది. కాని ఈఎస్‌ఐలో అలా కాదు. తొమ్మిది, 10 గంటల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
మందుల్లేవు......
          అన్నింటికి ఓర్చుకుని పరీక్షలు చేయించుకుని డాక్టర్‌ కన్సల్టేషన్‌ తర్వాత రాసిన మందుల కోసం వెళితే అక్కడ మళ్లీ క్యూ కట్టాల్సిందే. మందుల షాపులో డాక్టర్లు రాసిన మందులు పూర్తి స్థాయిలో దొరకడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ లేని మందులను డిస్పెన్సరీల్లో తీసుకోవాలంటూ సిబ్బంది సూచిస్తున్నారు. డిస్పెన్సరీల్లోనూ మందుల కొరత తీవ్రంగా ఉంటున్నదని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి లాంటి చోట దొరకని మందులు డిస్పెన్సరీల్లో ఎలా దొరుకుతాయో అర్థం కాని పరిస్థితి. దీంతో అత్యవసరంగా వాడాల్సిన మందులను వాయిదా వేయడం ఇష్టం లేక ప్రయివేటులో కొనుక్కుంటున్నట్టు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు కల్పించాల్సిందే....మందులన్నీ ఇవ్వాల్సిందే...
          రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఈఎస్‌ఐ కార్డుదారులున్నారు. ఐపీల కుటుంబాలతో కలుపుకుని వీరి సంఖ్య దాదాపు 80 లక్షల వరకు ఉంది. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలను తీసుకుంటున్నారంటూ పోటాపోటీగా ప్రకటించుకుంటున్నాయి. తాజాగా ఇద్దరు కేంద్ర మంత్రులు శనివారం సనత్‌ నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించారు. ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకున్నారు. కనీస సౌకర్యాల నుంచి, అవసరమైన వారందరికి పరీక్షలు చేయడం, డాక్టర్లు రాసిన మందులన్నీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.