Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' కథనానికి స్పందన
- బాధ్యతలు స్వీకరించిన జ్యోతిబుద్ధ ప్రకాశ్
నవతెలంగాణ - హైదరాబాద్/సిటీబ్యూరో
ఎట్టకేలకు రవాణాశాఖ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. చేనేత, జౌళిశాఖల ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులైన జ్యోతి బుద్ధప్రకాశ్ మంగళవారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. మే 19 తేదీ ఆయన్ని చేనేత, జౌళిశాఖల ప్రభుత్వ కార్యదర్శిగా, రవాణాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 40 రోజులు పూర్తయినా, ఆయన రవాణాశాఖ కమిషనర్గా బాధ్యతలు తీసుకోకపోవడంపై జూన్ 26న 'వామ్మో రవాణా' శీర్షికతో 'నవతెలంగాణ' కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ వెంటనే ప్రభుత్వ సమీక్షా సమావేశాల్లో చర్చ జరిగింది. దీనిపై రవాణాశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతి బుద్ధప్రకాశ్ రవాణాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. అయితే ఆయన బాధ్యతలు తాత్కాలికమే. పూర్తిస్థాయి కమిషనర్ను ప్రభుత్వం నియమించాల్సి ఉంది.