Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మినిమం టైంస్కేల్ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న మరో ఎనిమిది మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు (జీవోనెంబర్ 20) జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మినిమం టైంస్కేల్ కింద పనిచేస్తున్న (22 మంది జనరల్, 52 మంది ఒకేషనల్ విభాగం) 74 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను గతంలోనే క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎని మిది మందితో కలిపి క్రమబద్ధీకరణ పూర్తయిన వారి సంఖ్య 82కి చేరింది. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2016, ఫిబ్రవరి 26న రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 16ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేయడం పట్ల టీఎస్జీసీసీఎల్ఏ-475 అధ్యక్షులు జి రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ హర్షం ప్రకటించారు. మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ప్రకటించాలని కోరారు.