Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ - స్టేషన్ఘన్పూర్
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పింది. కర్నూల్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో స్టేషన్ సమీపంలో 11, 12 బోగీలు విడిపోయాయి. సుమారు 300మీటర్ల దూరం మేరకు వెళ్లి ఆగిపోయింది. దాంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సాంకేతిక సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు.