Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముషం రమేష్
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
వర్క్ టూ ఓనర్ పథకాన్ని త్వరగా పూర్తి చేసి కార్మికులకు అందించాలని సిరిసిల్ల పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముషం రమేష్ కోరారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమను పరిశీలించడానికి వచ్చిన చేనేత జౌళి శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడం, కార్మికులను యజమానులు చేయడమే లక్ష్యంగా పెద్దూరు శివారులో నిర్మిస్తున్న వీవింగ్ పార్కు షెడ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. వెంటనే వాటి నిర్మాణాన్ని పూర్తి చేసి మరమగ్గాలను బిగించి కార్మికులకు అందించాలని కోరారు.