Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
- బలహీనపడ్డ తీవ్ర అల్పపీడనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందనీ, అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖా తంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అది అల్పపీడనంగా మారింది. దానికి అనువర్తనంగా సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది.