Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 3,48,171 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,34,329 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 1,13,267 మంది మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ కోసం 99,667 మంది, ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ కోసం 15 మంది, ఇతరులు 893 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల రాసేందుకు ఫీజు చెల్లించారు. ఈనెల 26 నుంచి 30 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 22న నైతికత, మానవ విలువలు పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తారు.