Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరదల్లో చిక్కుకున్న ఇద్దరు గర్భిణీలను రక్షించడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయలు, సింగరేణి కాలరీస్ యాజమాన్యం కోటి రూపాయలు కలిపి రూ.రెండు కోట్లు నష్టపరిహారం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వం లేదా సింగరేణిలో అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. రెస్క్యూ టీమ్లో సభ్యులకు యాజమాన్యం ఎలాంటి రక్షణ పరికరాలూ ఇవ్వకుండా సహాయ చర్యలకు పంపినందుకే వారు ప్రమాదంలో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.