Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సివిల్స్ అభ్యర్థులకు ఆప్షనల్ ఎంపికపై ఆదివారం ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి క్రిష్ణప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి హైదరాబాద్లోని అశోక్నగర్లో ఉన్న తమ అకాడ మి సెమినార్ హాల్లో ఈ సదస్సును నిర్వహిస్తామని పేర్కొన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,సోషియాలజీ,ఆంత్రోపాలజీ,తెలుగు,జాగ్రఫీ, పీఎస్ఐఆర్ వంటి సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తామని వివరించారు. సివిల్ సర్వీసెస్లో అత్యంత కీలకమైన ఆప్షనల్ సబ్జెక్టును ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎలా అత్య ధిక మార్కులు సాధించవచ్చో సీనియర్ అధ్యాపకులు వివరిస్తారని తెలిపారు.