Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18,19 తేదీల్లో కట్టాలి : ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు రూ.200 ఆలస్య రుసుంతో ఈనెల 18,19 తేదీల్లో కట్టాలని కోరారు. కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు ఈనెల 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల నాటికి టీఎస్బీఐఈ అకౌంట్లో ఆ సొమ్మును జమ చేయాలని ఆదేశించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు 3,48,171 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.