Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరా సర్వేల వెనుక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలున్నాయని ఏఐసీసీ కార్యదర్శి ఎస్ఏ సంపత్కుమార్ విమర్శించారు. దానికి వెనక ఉన్న దొంగలు దొరికిపోయారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఆ సర్వేలను విడుదల చేశారని ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్లో పార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్, శివసేనారెడ్డి, మెట్టు సాయి కుమార్, సుధీర్రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి బలమైన నేతలున్నారని చెప్పి 23 శాతం ఓట్లు వస్తాయనీ, 26 మంది బలమైన నేతలున్న బీజేపీకి మాత్రం 33 శాతం ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.