Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న గర్భిణీని రక్షించే క్రమంలో సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు అంబాల రాము, చిలుకా సతీష్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా వారికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.
జమీర్ మృతిపై...
విధి నిర్వహణకు వెళ్లి వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరమని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.