Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీహార్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ జమా ఖాన్,ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ (రాజ్యసభ) సలీమ్ అన్సారీ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని హైదరాబాద్లోని ఆయన అధికారిక నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా మైనార్టీలు, ముస్లింల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న షాదీ ముబారక్ , రెసిడెన్షియల్ పాఠశాలలు, సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇమామ్, తదితర పథకాలను హౌంమంత్రి వివరించారు. అనంతరం తమ తమ రాష్ట్రాలను సందర్శించాల్సిందిగా హౌంమంత్రిని వారు ఆహ్వానించారు.