Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీటమునిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన రిటైర్డ్ ఐఏఏస్ అధికారి, సోషల్ డెమొక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళిని పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ. టి స్కైలాబ్ బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన్ను అరెస్టు చేయడం తగదనీ, రాష్ట్రంలో ఎవరికైనా, ఎక్కడైనా ప్రజాసమస్యలను పరిశీలించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాయ డం అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగంటడాన్ని జీర్ణించుకొలేకే మురళిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.