Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన ప్రజా సంబంధాల అధికారి మార్గం లక్ష్మీనారాయణను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం గిరిజన విజ్ఞాన అధ్యయన శాఖ ఆధ్వర్యంలో, వరంగల్లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో మారుతున్న గిరిజనుల సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు - ఐటీడీఏ ప్రభావం, గోవిందరావుపేట మండలం అనే అంశంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ పర్యవేక్షణలో లక్ష్మినారాయణ పరిశోధన చేశారు. ఈ క్రమంలో ఆయనకు యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది.