Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు శుక్రవారం నైతికత, మానవ విలువలు పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. శనివారం 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యావరణ విద్య పరీక్ష జరుగుతుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి 30 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు.