Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
నవతెలంగాణ- శంషాబాద్
మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగికదాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ బతుకుదెరువు నిమిత్తం శంషాబాద్లో నివాసముంటున్నది. ఒంటరిగా ఉంటున్న ఆమెని శంషాబాద్ సబ్స్టేషన్లో పనిచేసే చందులాల్ అనే ఉద్యోగి వేధించసాగాడు. ఆమె అతనికి లొంగకపోవడంతో మత్తుమందు ఇచ్చి లైంగికదాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బాధితురాలిని బెదిరించాడు. అయితే సదరు మహిళ సోమవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిండిలో ఘటన జరగడంతో ఇక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును అక్కడికి బదలాయింపు చేశారు.