Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన 'ఇనుగుర్తి'ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ను ఆదేశించారు. ఇనుగుర్తిని మండలం చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి విజ్జప్తి చేశారు. దీనిపై సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను సోమవారంనాడు ప్రగతిభవన్కు పిలిపించుకుని చర్చించి, ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తంచేశారు.