Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొగాకు నియంత్రణ ప్రాంతీయ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (ఆర్సీటీసీ) సంచాలకులు ఆచార్య రాజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్కు విచ్చేసిన ఆయన నారాయణగూడలోని ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీలను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ సదస్సులో పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను భాగస్వాములు చేయనున్నట్టు తెలిపారు. దీనిపై 20 ఏండ్ల నుంచి కృషి చేస్తున్న పౌరసరఫరాలశాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ను అభినందించారు.