Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేకాట ఆడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదారుగురు మంత్రులు, పదిహేను మంది ఎమ్మెల్యేలెవరో బయట పెట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు పెద్ద హీరోయిన్లతో బంధాలున్నాయనే విషయంలో నిజాలు బయటకు రావాలన్నారు. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించకపోగా, మద్యం తెలంగాణను సాధించారని ఎద్దేవా చేశారు. చిక్కోటి ప్రవీణ్ వెనక రాజకీయ నాయకులు ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్పై మంత్రి మల్లారెడ్డి చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన్ను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.