Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్, సీఎం సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తల్లి గుగులోత్ దస్మీ మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం వారు వేర్వేరు ప్రకటనల్లో ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వాలని గవర్నర్ భగవంతున్ని ప్రార్థించారు. రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు దస్మి మరణం పట్ల సంతాపం తెలిపారు.