Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టును ముంచిన మొయిల్ కంపెనీకి మళ్లీ పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలా అప్పగించారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్ లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాసిరకపు పనుల వల్ల పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం రూ. 52వేల కోట్ల కాంట్రాక్టు పనులను ఆ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.