Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్
కరీంనగర్లో సెప్టెంబర్ 14,15,16 తేదీల్లో నిర్వహించనున్న భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర 4వ మహాసభ లోగోను ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ 4వ రాష్ట్ర మహాసభలో విద్యారంగం సమస్యలపై నిర్దిష్టంగా చర్చించి ప్రభుత్వాలకు నివేదిక అందించాలని సూచించారు. దేశంలోని విద్యారంగ పరిస్థితులపై సమగ్ర చర్చ జరగాలని, యూనివర్సిటీలు, ప్రొఫెషనల్ విద్య అందరికీ అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా ప్రత్యేకతకు అనుగుణంగా ఈ లోగో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, శనిగరపు రజినీకాంత్ పాల్గొన్నారు.